సుప్రియనే నిర్మాతగా ఎందుకంటే? డెకాయిట్ గురించి అడవి శేష్ ఎమోషనల్
యంగ్ హీరో, హీరోయిన్లు అడివి శేష్, మృణాల్ థాకూర్ జంటగా రూపొందుతున్న చిత్రం డెకాయిట్. ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాకు షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలోియో సంగీతం, కొడవాటి పవన్ కల్యాణ్ ఎడిటర్గా, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. ఏ విజయ్ యాక్షన్ డైరెక్టర్గా, విజయ్ పీ కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొన్న క్రమంలో డెకాయిట్ టీమ్ మీడియాతో ముచ్చటించింది. ఈ ప్రెస్ మీట్లో ఫిల్మీబీట్ అడిగిన ప్రశ్నకు అడివి శేష్ సమాధానం ఇస్తూ..

సాధారణంగా నా సినిమాకు ఎక్కువ సమయం తీసుకొంటాను. ఈ చిత్రం పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. దాదాపు 150 రోజులు షూటింగ్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ఉంది. ఈ సినిమాను ఎక్కువ రోజులు షూట్ చేయడానికి ప్రధాన కారణం తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేయడం వల్ల కొంత ఎక్కువ సమయం తీసుకొన్నది అని శేష్ పేర్కొన్నారు.
ఈ చిత్రం కథ డిమాండ్ చేయడంతో ఎక్కువ సెట్స్ వేయాల్సి వచ్చింది. ఇండోర్లోనే సెట్స్లో షూట్ చేశాం. ఈ విషయంలో బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు. క్వాలిటీ ప్రొడక్ట్ అందించాలని యూనిట్ అంతా పనిచేసింది. ఈ సినిమా విషయంలో అందరం కొత్తగా కొన్ని విషయాలు నేర్చుకొన్నాం. ఈ సినిమా పక్కాగా జెన్యూన్ ప్రాజెక్ట్ అని అడవి శేష్ తెలిపారు.
అయితే ఈ సినిమాకు సుప్రియా నిర్మాతగా వ్యవహరించడానికి ప్రధాన కారణం.. గూఢచారి సమయంలో నాగార్జున అక్కినేని సార్ చాలా సపోర్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో ఫ్రీగా షూట్ చేసుకొనేందుకు అవకాశం ఇచ్చారు. అప్పడే చిన్న మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చారు. రుణం తీర్చుకొనే అంశంలో భాగంగా ఈ సినిమాతో సుప్రియ భాగమయ్యారు. అప్పుడు నాకు ఇచ్చిన మొత్తం ఇప్పటి విలువతో పోల్చుకంటే చాలా ఎక్కువ అని అడవి శేష్ అన్నారు.


Click it and Unblock the Notifications
















