Don't Miss!
- News Astrology: రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అన్న క్షేమంగా ఇంటికి వచ్చాడు.. సూర్య ఆరోగ్యంపై కార్తీ పోస్ట్
సూర్యకు కరోనా నెగెటివ్ వచ్చిందని, ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చామని అంతా బాగానే ఉందంటూ హీరో కార్తీ ప్రకటించాడు. తాను కరోనా బారినపడ్డానని సూర్య గతవారం స్వయంగా ప్రకటించాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ అందరికీ ఓ స్వీట్ వార్నింగ్లాంటిది ఇచ్చాడు. ఇంకా కరోనా పోయిందని అందరూ భావిస్తున్నారు.. ప్రమాదం ఇంకా ఉందంటూ జాగ్రత్తలు పాటించాలని సూర్య చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం కరోనా ఎవ్వరూ భయపడటం లేదు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందన్న ధీమాతో అందరూ నిర్భయంగా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. కరోనా కేసులు రోజూ నమోదు అవుతున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ నిర్లక్ష్యం గురించే సూర్య అందరినీ హెచ్చరించాడు. ఫిబ్రవరి 7న కరోనా బారినట్టు పేర్కొన్నాడు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ని రోజులు చికిత్సతీసుకన్నాడు. తాజాగా సూర్య ఆరోగ్య పరిస్థితిపై కార్తీ ట్వీట్ చేశాడు.
సూర్య క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడనే విషయాన్ని కార్తీ చెబుతూ.. 'అన్న సురక్షితంగా ఇంటికి వచ్చాడు.. అయితే ఇంకొన్ని రోజులు ఇంట్లోనే క్వారంటైన్ అవుతాడు.. మీ ప్రార్థనలు, మీరు కురిపించిన ప్రేమకు ఎన్ని సార్లు థాంక్య్ చెప్పినా కూడా తక్కువే అవుతుంది' అంటూ ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి ఈ వార్త విన్నాక సూర్య అభిమానులు ఆనంద పడుతున్నారు. సూర్య చివరగా ఆకాశం నీ హద్దురా అనే చిత్రంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.