Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తాడం రీమేక్లో రామ్.. ఫ్యానీ రేటుకు స్రవంతి మూవీస్కి హక్కులు
తమిళంలో అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయంతో వచ్చిన తాడం చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం టాలీవుడ్ నిర్మాతలు భారీగా పోటీపడ్డారు. అయితే ఈ చిత్ర రీమేక్ హక్కులను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్, అధినేత స్రవంతి రవికిషోర్, ప్రముఖ నిర్మాత టాగోర్ మధు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకొన్నారు.
తమిళంలో అరుణ్ విజయ్ పోషించిన పాత్రను తన సొంత నిర్మాణ సంస్థలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసే అవకాశం పుష్కలంగా ఉంది. ఒకవేళ రామ్ చేయలేని పరిస్థితుల్లో మరో హీరోను రంగంలోకి దించాలని రవికిషోర్, టాగోర్ మధు ఆలోచనలో ఉన్నారు. మార్చి చివరివారంలో ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతికవర్గం వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది అని ప్రముఖ పీఆర్వో పులగం చిన్నారాయణ ట్వీట్ చేశారు.
The recent #tamil #sensation #Thadam movie rights have become very #competitive @SravanthiMovies #sravanthiravikishore garu #tagoremadhu garu have got the rights together..! This dual role hero character may be done by @ramsayz or sum1 else will be clarified by End of month..!! pic.twitter.com/yc4USCgdCg
— Pulagam Chinnarayana (@PulagamOfficial) March 12, 2019
తమిళంలో అరుణ్ విజయ్, తన్యా హోప్, యోగిబాబు, స్మృతి వెంకట్, విద్యా ప్రదీప్ తదితరులు నటించారు. అరుణ్ విజయ్ బిజినెస్ మెన్గా, జనాన్ని మోసం చేసే దొంగ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి మగీజ్ తిరుమెనీ దర్శకుడు. మార్చి 1న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలకు నోచుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది.
ప్రస్తుతం హీరో రామ్ పూరీ కనెక్ట్ రూపొందించే ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకుడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా తర్వాత రామ్ తాడం రీమేక్తోపాటు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్లో నటించే అవకాశం ఉంది.