తమన్నాకు కరోనా పాజిటివ్.. హైదరాబాద్కు వచ్చే ముందే లక్షణాలు.. ఆలస్యం చేసిందా?
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా కరోనా వైరస్ భారిన పడడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. ఆమె గత కొంత కాలంగా ముంబైలో తన తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నారు. ఇక ఇటీవల షూటింగ్స్ మొదలు కావడంతో హైదరాబాద్కు రావాల్సి వచ్చింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ కోసం బిజీ అవుతున్న తరుణంలో సడన్ గా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.
Recommended Video

గత కొన్నిరోజులుగా దగ్గు, జ్వరం
షూటింగ్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో తమన్నా ఈ రోజు కరోనావైరస్ భారిన పడినట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా తమన్నాకు దగ్గు జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా దగ్గు తగ్గకపోవడంతో వెంటనే ఆమె హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది.

తల్లిదండ్రులు కోలుకున్న కొన్ని రోజులకే
గత రెండు నెలల క్రితమే తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన తమన్నా తనకు మాత్రం నెగిటివ్ వచ్చిందని అప్పుడు వివరణ ఇచ్చింది. ఇక అంతా సెట్టయిందని షూటింగ్స్ మొదలుపెడదామని అనుకున్న సమయానికి ఆమె ఆరోగ్యం హఠాత్తుగా క్షిణించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు కోలుకున్న కొన్ని రోజులకే తమన్నా వైరస్ భారిన పడటం హాట్ టాపిక్ గా మారింది.

షూటింగ్ కోసం రేడి అవుతుండగా
ఆహా యాప్ లో తమన్నా ఒక టాక్ షో చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన షూటింగ్ కోసం రేడి అవుతుండగా అనుకోకుండా ఈ వైరస్ భారిన పడ్డట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు వచ్చే ముందే తమన్నాకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఇన్ఫెక్షన్ స్థాయి ఎలా ఉందో..
ఇక తమన్నాకు సంబంధించిన పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తరువాత ఇన్ఫెక్షన్ స్థాయి ఎలా ఉందో తెలియనుంది. ఇక తమన్నా 15రోజుల పాటు షూటింగ్స్ కి దూరం కానుంది. ప్రస్తుతం ఆమె ఒక వెబ్ సిరిఆ తో పాటు గుర్తుంది శీతాకాలం అనే సినిమా చేస్తోంది. అలాగే గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటిమార్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











