Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ముంబై మున్సిపల్ కార్మికుల కోసం హృతిక్ భారీ విరాళం..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మానవత్వాన్ని చాటుకొన్నారు. కరోనా కాటుకు అతలాకుతలమైన జీవితాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించడంతో వీధిన పడిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకొన్నారు.
కరోనా పరిస్థితి కారణంగా రేయింబవళ్లు శ్రమిస్తున్న ముంబై మున్సిపల్ (బీఎంసీ) కార్మికులకు ఆర్థిక సహాయం అందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యల్లో భాగంగా కావాలని నిర్ణయించుకొన్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న మహారాష్ట్ర పభుత్వానికి సహాయంగా నిలిచారు అని అధికారులు వెల్లడించారు.
బీఎంసీ వర్కర్లు, ఇతర సహాయ బృందాల కోసం హృతిక్ రోషన్ సుమారు రూ.20 లక్షల విరాళం ప్రకటించారు అని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
ఈ సందర్బంగా హృతిక్ ట్వీట్ చేస్తూ.. ఇలాంటి కష్టకాలంలో మన కోసం, సొసైటీ కోసం ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న ప్రతీ ఒక్కరికి మనం అండగా నిలువాలి. బీఎంసీ సిబ్బంది కోసం n95, FFP3 మాస్కులను అందిస్తున్నాను అని హృతిక్ ట్వీట్లో పేర్కొన్నారు.