Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ప్యాన్ ఇండియా మూవీపై కన్నేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్
'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక్కసారిగా నేషనల్ వైడ్ ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఓ క్రైమ్ డ్రామాతో కూడిన సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.
త్వరలో తాను ప్యాన్ ఇండియా మూవీ చేయాలనుకుంటున్నానని, ఇది క్రైమ్ డ్రామా నేపథ్యంలో సాగు కథ అని, అయితే అందులో ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు మరికొన్ని రోజుల్లో ప్రకటించబోతున్నట్లు సందీప్ రెడ్డి వెల్లడించారు.
మంచి కంటెంట్ ఉంటే సౌత్ సినిమాలు హిందీలో కూడా బాగా ఆడతాయి అని బాహుబలి, కెజిఎఫ్ లాంటి చిత్రాలు ప్రూవ్ చేశాయని ఈ సందర్భంగా సందీప్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో ఈ యంగ్ డైరెక్టర్.. మహేష్ బాబును కలిసి కథ చెప్పినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై సరైన క్లారిటీ లేదు.
'అర్జున్ రెడ్డి' స్టార్ విజయ్ దేవరకొండతో కూడా సందీప్ రెడ్డి టచ్లోనే ఉన్నాడట. అయితే విజయ్ కూడా ఇప్పటికే పలు చిత్రాలకు కమిట్మెంట్ ఇచ్చి బిజీగా ఉండటంతో ఇప్పట్లో వీరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన తొలి బాలీవుడ్ మూవీ 'కబర్ సింగ్' వివరాల్లోకి వెళితే... షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈచిత్రం జూన్ 21న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.