పోటీకి సిద్ధం అవుతున్న మిస్టర్ మజ్ను.. విడుదల ఎప్పుడంటే!
అక్కినేని యువ వారసుడు అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి దర్శత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నాటీ బాయ్ గా ఈ చిత్రంలో అఖిల్ నటిస్తున్నాడు. మిస్టర్ మజ్ను ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తొలి రెండు చిత్రాలు నిరాశపరిచినప్పటికీ అఖిల్ చేస్తున్న ఈ మూడవ ప్రయత్నం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని అభిమానులు అంటున్నారు.
ఈ చిత్ర విడుదల తేదీ గురించి ఆసక్తికర ప్రచారం సినీవర్గాల్లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి గాని లేదా జనవరి 25 కానీ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి రాంచరణ్ చిత్రం, ఎన్టీఆర్ బయోపిక్ వంటి బడా చిత్రాలు రెడీ అవుతున్నాయి. మిస్టర్ మజ్నుని కూడా విడుదల చేస్తే పోటీని తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది.

కానీ సంక్రాంతికి విడుదలయ్యే అన్ని చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది కాబట్టి నిర్మాతలు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా కనకుండా జనవరి 25న సోలోగా వస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాలు కూడా మిస్టర్ మజ్ను చిత్ర యూనిట్ లో వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











