Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ఆదిపురుష్’ నుంచి ఆసక్తికర అప్డేట్: వాటిలా కాకుండా కొత్త కథతో ప్రభాస్ సినిమా
వరుసగా పాన్ ఇండియా సినిమాలను ప్రకటిస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్తో యూనివర్శల్ స్టార్ అయిన అతడు.. ఆ తర్వాత బడా ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్'తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ పాన్ ఇండియా మూవీ గురించి తాజాగా ఓ ఆసక్తికరమై వార్త బయటకు వచ్చింది.
'ఆదిపురుష్' రామాయణ కాలం నాటి కథతో తెరకెక్కనుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో ప్రభాస్ రాముడిగానూ, సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగానూ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బడా మూవీ రామాయణ కాలం నాటి కథే అయినా.. ఇప్పటి వరకూ చూపించని కొత్త కోణాన్ని ఇందులో టచ్ చేయబోతున్నారట. ఇందుకోసం దర్శకుడు ఓం రౌత్ ప్రత్యేకమైన ప్రణాళికను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ మూవీ కోసం కొన్ని నవళలను కూడా తిరగేశాడని అంటున్నారు.
ఇదిలా ఉండగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్తో రూపొందే ఈ సినిమాను హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ మూవీలో సీతగా '1 నేనొక్కడినే' ఫేం కృతీ సనన్ నటిస్తుండగా, లక్ష్మణుడి పాత్రను బాలీవుడ్ హీరో సన్నీ సింగ్ పోషిస్తున్నట్లు బీ టౌన్లో తెగ ప్రచారం జరుగుతోంది.