Don't Miss!
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- News వైఎస్ షర్మిలకు షాక్.. వియ్యంకురాలుపై ఐటీ దాడులు
- Sports ఐపీఎల్ లైవ్ ఫ్రీ.. ఒక్క RCB ఫ్యాన్స్కు తప్ప!
- Lifestyle ఈ మూడింటిలో మీ వేలు ఆకారం ఎలా ఉందో చెప్పండి... మీరు ఎలాంటి వారో మేం చెబుతాం
- Finance Gold Rate: షాకింగ్.. షాకింగ్.. షాకింగ్.. ఏకంగా రూ.4,600 పెరిగిన గోల్డ్.. ఒక్కరోజులోనే..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ అప్డేట్.. తిరుపతిలో వైభవంగా!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ అందరిలో ఉత్కంఠ రేపుతోంది. తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. భారీ స్థాయిలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాలని క్రిష్ అండ్ టీం భావిస్తోంది.
డిసెంబర్ 16న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారట. ఈ కళ్ళు చెదిరే ఈవెంట్ కు టెంపుల్ సిటీ తిరుపతి వేదిక కానుంది. సినీవర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం భారీ స్థాయిలో ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు అతిధులుగా హాజరవుతారట.
బాలయ్య తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. క్రిష్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్ వివిధ ప్రముఖల పాత్రలో మెరవబోతున్నారు. విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని జనవరి 9న విడుదుల చేయనున్నారు.