Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Brahmaji: 'అంకుల్ ఏంట్రా.. అంకుల్.. కేసు వేస్తా ' అని బ్రహ్మాజీ పోస్ట్.. అనసూయకు సెటైర్?
ఇక ఇప్పుడు ఆంటీ, అంకుల్ అని పిలవడం నేరంగా పరిగణించవచ్చేమో అని అనిపిస్తుంది ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే, రీసెంట్గా యాంకర్, నటి అనసూయను ట్విటర్లో ఆంటీ అని పిలవడం, దానిపై కేసు వేస్తానని చెప్పడంతో పాటు పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్ అయింది. ఇక దీనిపై మాములుగా ట్రోల్స్, మీమ్స్ రాలేదు. అంతేకాకుండా ఒక రోజు ఆంటీ అని హ్యాష్ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. అయితే తాజాగా ఈ విషయంపై నటుడు బ్రహ్మాజీ పరోక్షంగా సెటైర్ వేసినట్లు తెలుస్తోంది.
సక్సెస్ఫుల్గా..
సీనియర్ నటుడు బ్రహ్మాజీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్గా, నటుడిగా ఎన్నో పాత్రల్లో అలరిస్తూ వస్తున్నాడు. చిన్నా, పెద్ద అనే ఏ తేడా లేకుండా సుమారు అందరూ అగ్ర హీరోలతోపాటు యువ కథానాయకులతో కలిసి నటించాడు. అప్పుడప్పుడు టీవీ షోలలో, పలు కార్యక్రమాలలో తనదైన కామెడీ పంచులతో ఆడియెన్స్ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సినిమాల్లో సహాయ నటుడు, నెగెటివ్ రోల్స్ వంటి విభిన్నమైన పాత్రలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ నటుడిగా రాణిస్తూ ముందుకు సాగుతున్నాడు.
అది బాడీ షేమింగ్..
ఇక ఇటీవల ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడం, ఆంటీ అని పిలిస్తే వేధించినట్లే అని యాంకర్ అనసూయ చెప్పడం పెద్ద రచ్చ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అది బాడీ షేమింగ్ మీదకు వస్తుందని, కేసు వేస్తానని కూడా హెచ్చరించింది. అయితే తాజాగా నటుడు బ్రహ్మాజీ పెట్టిన పోస్ట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది. కాసేపటి క్రితం ట్విటర్లో బ్రహ్మాజీ ఒక ఫొటోను షేర్ చేస్తూ ''ఏం జరుగుతోంది?'' అని ట్వీట్ చేశాడు.
అంకుల్ ఏంట్రా?
దానకి ఓ నెటిజన్.. 'ఏం లేదు అంకుల్' అని సమాధానమిచ్చాడు. అది చూసిన బ్రహ్మాజీ 'అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా.. ఏజ్.. బాడీ షేమింగా?' అంటూ ఫన్నీ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. ఇక వైరల్ అయిన ఈ ట్వీట్ను చూసిన నెటిజన్లు మరింత ఫన్నీగా స్పందిస్తున్నారు. 'మీరు ఎన్ని కేసులు వేస్తానని చెప్పినా, ఆ ఆంటీ గారికి వచ్చినంత అటెన్షన్ మాత్రం మీకు రాదు బ్రహ్మాజీ గారు' అంటూ ఒకరు కామెంట్ చేశారు.
సెటైర్ వేశాడా?
మరొకరు 'ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేశారా? అయితే ఎన్ని కేసులు పెడతారు సార్?' అని కామెంట్ చేశారు. ఇలా వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ ఆంటీ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అంతా విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్ మూవీపై పరోక్షంగా అనసూయ కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేయడంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రహ్మాజీ పెట్టిన పోస్ట్ అనసూయకు సెటైర్ వేశాడా? లేదా ప్రస్తుత పరిస్థితిపై తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ను చూపించాడా? అనేది తెలియదు.