Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Aryan Khan కు అనన్య పాండే మూడుసార్లు గంజాయి సప్లై?.. ఎన్సీబీ విచారణలో కొత్త విషయాలు
బాలీవుడ్ నటి అనన్య పాండేను విచారిస్తున్న క్రమంలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు రోజులుగా అనన్య పాండేను లోతుగా విచారిస్తున్నట్టు సమాచారం. ఆర్యన్ ఖాన్, అనన్య మధ్య జరిగిన ఛాటింగ్ను ఆధారంగా చేసుకొని విచారణ కొనసాగిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్సీబీ వెల్లడించినట్టు బాలీవుడ్ పత్రికలు, వెబ్ సైట్లు వెల్లడించిన ప్రకారం మూడుసార్లు ఆర్యన్ ఖాన్కు గంజాయి (వీడ్) పంపించినట్టు తెలుస్తున్నది.
గురువారం అనన్య పాండే ఇంటిలో సోదాలు, తనిఖీలు జరిగిన ఎన్సీబీ అధికారులు ఆమె మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకొన్న సంగతి తెలిసిందే. అనన్య ఫోన్లు ఇతర పరికరాలను ఫోరెన్సిక్ శాఖకు పంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అనన్య పాత మొబైల్ను, ఇటీవల కొనుగోలు చేసిన కొత్త మొబైల్ను కూడా స్వాధీనం చేసుకొని విచారణ చెప్పినట్టు తెలిసింది.
అయితే శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లే ముందు అనన్య పాండే భోరున విలపించారు. ఆమె వెంట తండ్రి చంకీ పాండే వెళ్లారు. ఆయన ఆఫీస్లోని ఫ్రంట్ రూంలో వేచి ఉన్నారు. అధికారులు ప్రశ్నించిన సమయంలో అనన్య పాండే చాలా కామ్గా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.
వాట్సప్ ఛాట్లో ఆర్యన్ ఖాన్తో జుగద్, వీడ్ అంటూ వాడిన పదాల గురించి అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్టు సమాచారం.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత సినీ తారలతో డ్రగ్స్ లింక్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో భాగంగా వాట్సాప్ ఛాట్స్పై దృష్టిపెట్టిన ఎన్సీబీకి యువ హీరోయిన్ అనన్య పాండే వ్యవహారం బయటపడింది. వాట్సప్ ఛాట్లో ఆర్యన్ ఖాన్, అనన్య పాండే డ్రగ్స్ సమకూర్పు, కోనుగోలు గురించి చర్చించుకొన్నట్టు ఎన్సీబీ అధికారులు ఆరోపించారు. తమ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ముంబై కోర్టుకు సమర్పించడం తెలిసిందే.