Don't Miss!
- News రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
హీరో రాజశేఖర్కు షాక్.. సెట్స్పైకి వెళ్లాల్సిన మూవీ..
గరుడ వేగ, కల్కి సినిమాలతో మళ్లీ ట్రాక్ పైకి వచ్చిన యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కల్కి తర్వాత ప్రదీప్ కృష్ణమూర్తి అనే దర్శకుడితో సినిమా ప్లాన్ చేశారు. ఎమోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కే ఈ చిత్రం అక్టోబర్లో సెట్స్పైకి తీసుకెళ్లి మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే అందుకు భిన్నంగా ఈ చిత్రం ఆగిపోయిందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
తన చిత్రం ఆగిపోయినట్టు వస్తున్న వార్తలపై రాజశేఖర్ స్పందించకపోవడం మరింత చర్చనీయాంశమైంది. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి, హీరో రాజశేఖర్ మధ్య క్రియేటివ్ విభేదాలు బలంగా చోటుచేసుకోవడంతో సినిమాను ఆపివేద్దామనే నిర్ణయాన్ని తీసుకొన్నట్టు సమాచారం. కొన్ని అంశాల మీద ఇద్దరికి ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల విభేదాలు మరింత ముదిరాయని చెప్పుకొంటున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్పై నిర్మాత తీవ్రమైన నిర్ణయం తీసుకొనే పరిస్థితి ఉందనే విషయం సినివర్గాల్లో చర్చనీయాంశమైంది. సినిమాలో హీరో రాజశేఖర్ మార్చడమా? లేక అసలు ప్రాజెక్ట్నే నిలిపివేయడమా అనే కోణంలో చర్చలు సాగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో బ్రహ్మానందం, సత్యరాజ్, నాజర్ తదితరుల ఎంపిక జరిగిన విషయం తెలిసిందే.
చాలా కాలం తర్వాత గరుడ వేగతో బ్లాక్ బస్టర్ అందుకొన్న రాజశేఖర్ కల్కితో సగటు విజయాన్ని అందుకొన్నారు. తాజాగా క్రేజీ స్పస్సెన్స్ థ్రిల్లర్ కోసం చేసిన ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో మళ్లీ కొత్త ప్రాజెక్టుపై దృష్టిపెట్టినట్టు సమాచారం.