Don't Miss!
- Technology వన్ప్లస్ 12R స్పెషన్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. బ్యాంకు ఆఫర్ల ద్వారా ధర తగ్గింపు..!
- Sports IPL 2024: ‘నా గుండె పగిలింది’ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం!
- Finance Layoff News: యూనీలివర్ 7,500 ఉద్యోగుల కోత.. పూర్తి వివరాలివే..
- Lifestyle Chapathi Kurma: చిటికెలో రుచికరంగా చపాతీ కుర్మా రిసిపి రెడీ.
- News Plume: భారత్ లో అంతర్జాతీయ సంస్ధ ప్లూమ్ తొలి ఆఫీసు ప్రారంభం- ప్రత్యేకతలివే..!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
హీరో రాజశేఖర్కు షాక్.. సెట్స్పైకి వెళ్లాల్సిన మూవీ..
గరుడ వేగ, కల్కి సినిమాలతో మళ్లీ ట్రాక్ పైకి వచ్చిన యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కల్కి తర్వాత ప్రదీప్ కృష్ణమూర్తి అనే దర్శకుడితో సినిమా ప్లాన్ చేశారు. ఎమోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కే ఈ చిత్రం అక్టోబర్లో సెట్స్పైకి తీసుకెళ్లి మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే అందుకు భిన్నంగా ఈ చిత్రం ఆగిపోయిందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
తన చిత్రం ఆగిపోయినట్టు వస్తున్న వార్తలపై రాజశేఖర్ స్పందించకపోవడం మరింత చర్చనీయాంశమైంది. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి, హీరో రాజశేఖర్ మధ్య క్రియేటివ్ విభేదాలు బలంగా చోటుచేసుకోవడంతో సినిమాను ఆపివేద్దామనే నిర్ణయాన్ని తీసుకొన్నట్టు సమాచారం. కొన్ని అంశాల మీద ఇద్దరికి ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల విభేదాలు మరింత ముదిరాయని చెప్పుకొంటున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్పై నిర్మాత తీవ్రమైన నిర్ణయం తీసుకొనే పరిస్థితి ఉందనే విషయం సినివర్గాల్లో చర్చనీయాంశమైంది. సినిమాలో హీరో రాజశేఖర్ మార్చడమా? లేక అసలు ప్రాజెక్ట్నే నిలిపివేయడమా అనే కోణంలో చర్చలు సాగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో బ్రహ్మానందం, సత్యరాజ్, నాజర్ తదితరుల ఎంపిక జరిగిన విషయం తెలిసిందే.
చాలా కాలం తర్వాత గరుడ వేగతో బ్లాక్ బస్టర్ అందుకొన్న రాజశేఖర్ కల్కితో సగటు విజయాన్ని అందుకొన్నారు. తాజాగా క్రేజీ స్పస్సెన్స్ థ్రిల్లర్ కోసం చేసిన ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో మళ్లీ కొత్త ప్రాజెక్టుపై దృష్టిపెట్టినట్టు సమాచారం.