Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
షారుక్ అభిమానులకు శుభవార్త.. క్రేజీ ప్రాజెక్ట్తో రెడీ.. డైరెక్టర్ ఎవరంటే
వరుస ఫెయిల్యూర్తో అభిమానులను షాక్లో ముంచిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఎట్టకేలకు శుభవార్తను అందించారు. ఏడాది కాలంగా వెండితెరకు దూరమైన ఈ హీరో మళ్లీ సెన్సేషనల్ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఇటీవల ఆయన నటించిన జీరో మూవీతోపాటు హ్యారీ మెట్ సెజల్ లాంటి పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. ఇంతియాజ్ అలీ, ఆనంద్ ఎల్ రాయ్ లాంటి దర్శకులు కూడా షారుక్ను విజయాల బాట పట్టించలేకపోయారు. దాంతో సినిమాల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నాడు షారుక్.
తాజాగా రాజ్ కుమార్ హిరాణీ రూపొందించబోయే సినిమాకు షారుక్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది బాలీవుడ్ మీడియా సమాచారం. షారుక్, రాజ్ కుమార్ హిరానీ అందించే సినిమాకు విదూ వినోద్ చోప్రా నిర్మిస్తున్నట్టు సమాచారం.
గతంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమా కోసం షారుక్ను సంప్రదించగా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. ఆ చిత్రంతో సంజయ్ దత్ మంచి పాపులారిటీని సొంతం చేసుకోవడం తెలిసిందే. ఇక చాలా ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో మరో సినిమా రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.