Don't Miss!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఏషియన్ సినిమా కార్యాలయంపై ఐటీ దాడులు.. అనూహ్యంగా అల్లు అర్జున్ పేరు తెరపైకి
టాలీవుడ్లో ఏషియన్ సినిమాకు ఉన్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లలో మెజార్టీ భాగం ఏషియాన్ సినిమాస్దే. సునీల్ నారంగ్, నారాయణ్ దాస్ పంపిణీ రంగంలో సక్సెస్ అయి థియేటర్ల నిర్మాణంలోనూ విజయం సాధించారు.
నిర్మాతగా అవతారం..
ఇక సునీల్ నారంగ్ సినిమాను నిర్మిస్తూ ప్రొడ్యూసర్ గానూ అవతారమెత్తారు. శేఖర్ కమ్ముల, నాగ చైతన్య కాంబినేషన్లో రాబోతోన్న చిత్రాన్ని ఏషియన్ సినిమాపై నిర్మిస్తున్నారు. దీంతో నిర్మాతగానూ సక్సెస్ అయ్యేందుకు రంగంలోకి దిగాడు.
సూపర్ స్టార్తో కలిసి ఏఎంబీ
ఏషియాలో ది మోస్ట్ లగ్జరీ మల్టీ ప్లెక్స్ అయిన ఏఎంబీని అత్యంత భారీ హంగులతో హైద్రాబాద్లో నిర్మించారు. అత్యాధునికి వసతులతో నిర్మించిన ఏఎంబీలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ అధినేత సునీల్ నారంగ్లకు వాటా ఉంది.
గతంలో ఏఎంబీ.. ప్రస్తుతం ఏషియన్ సినిమాపై
గతంలో జీఎస్టీకి సంబంధించి ఏఎంబీ మాల్పై దాడులు జరగ్గా.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు థియేటర్ యాజమాన్యం అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏషియన్ సినిమాపై ఐటీ దాడులు జరిగాయి. ఈ మేరకు సునీల్ నారంగ్, నారాయణ దాస్ సన్నిహితుల ఇంట్లోనూ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అనూహ్యంగా అల్లు అర్జున్ పేరు తెరమీదకు..
ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా అల్లు అర్జున్ పేరు తెరమీదకు వచ్చింది. సునీల్ నారంగ్ అల్లు అర్జున్తో కలిసి మరో భారీ మల్టీప్లెక్స్ను నిర్మించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.