Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మరో మల్టీస్టారర్ కథలో జగ్గూ భాయ్ పవర్ఫుల్ రోల్
జగపతిబాబు ఎలాంటి పాత్రలు చేసినా ఈ మధ్య కాలంలో ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పడుతోంది. ఎప్పుడైతే బోయపాటి ఆయనను విలన్ గా చూపించారో అప్పటి నుంచి వెండితెరపై పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. అగ్ర దర్శకుల సినిమాల్లో కూడా ఆయన పాత్రలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ఒకప్పుడు హీరోగా సంపాదించిన దానికంటే ఇప్పుడే స్పెషల్ పాత్రల్లో భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
ఇక ఆయన చేతిలో ఇప్పుడు మంచి సినిమాలే ఉన్నాయి. అందులో ఒక మినీ మల్టీస్టారర్ కూడా ఉంది. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహా సముద్రంలో శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో జగపతిబాబు పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా పలువురు బాలీవుడ్ స్టార్స్ ని అనుకున్నప్పటికి దర్శకుడు మళ్ళీ జగపతిబాబునే సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక మహాసముద్రం సినిమా విషయానికి వస్తే దర్శకుడు అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 హిట్టయినప్పటి నుంచి ఆ కథను చాలా మంది హీరోలకు చెప్పాడు కానీ వర్కౌట్ కాలేదు. అక్కినేని మెగా అల్లు కాంపౌండ్స్ వరకు వెళ్లిన ఆ కథను అందరు హీరోలు పొగిడారు గాని మల్టీస్టారర్ లో హెచ్చుతగ్గుల దగ్గర బయపడినట్లు టాక్ వచ్చింది. ఇక ఫైనల్ గా కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ సిద్దార్థ్ నటించడానికి ఒప్పుకున్నాడు. ఇక శర్వానంద్ పాత్ర కూడా ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్ వస్తోంది.