Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్: ‘జాతి రత్నాలు’ డైరెక్టర్తో స్టార్ హీరో.. నాగ్ అశ్విన్ ప్లాన్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు కొత్త దర్శకులు చాలా మంది పరిశ్రమకు పరిచయం అవుతుండడం వల్లే కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు వస్తున్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక, ఇలా ఇటీవల టాలీవుడ్కు పరిచయమై భారీ విజయాన్ని అందుకున్న దర్శకుల్లో 'జాతి రత్నాలు' దర్శకుడు అనుదీప్ కేవీ ఒకడు. ఔట్ అండ్ ఔట్ హిలీరియస్ కామెడీతో ఈ సినిమాను నడిపించిన తీరుకు తెలుగు ప్రేక్షకులు అందరూ ఫిదా అయ్యారు. దీంతో అతడికి ఎంతో మంచి పేరు కూడా వచ్చేసింది.
Bigg Boss: షోలో ఆ హీరోను అవమానించిన నాగార్జున.. స్టేజ్ మీదే ఆమెతో అలా చేయడంతో విమర్శలు
పెద్ద స్టార్లు నటించలేదు.. సీనియర్ దర్శకుడూ కాదు.. అనుభవం ఉన్న నిర్మాణ సంస్థ కూడా కాదు.. పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు.. అయితేనేం భారీ చిత్రాల రేంజ్లో విడుదలై సూపర్ డూపర్ హిట్గా నిలిచింది 'జాతి రత్నాలు'. విలక్షణ నటనతో విభిన్నమైన చిత్రాలు చేస్తూ ఔరా అనిపిస్తోన్న నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమాను అనుదీప్ కేవీ చాలా కొత్తగా తెరకెక్కించాడు. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం థియేటర్లలో నవ్వుల జల్లు కురిపించింది. తద్వారా సక్సెస్ను అందుకుని నిర్మాతలపై వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఫలితంగా టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన 'జాతి రత్నాలు' మూవీ థియేటర్లలో సత్తా చాటింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగానే దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ను కూడా డైరెక్టర్ అనుదీప్ మొదలు పెట్టేశాడు. ఇక, ఈ సీక్వెల్లో మాత్రం వీళ్లంతా అమెరికా వెళ్లి అక్కడ రచ్చ చేసింది చూపించబోతున్నట్లు దర్శకుడు కొద్ది రోజుల క్రితమే ఓ హింట్ ఇచ్చాడు. ఇక, ఈ స్క్రిప్టులో నిర్మాతగా వ్యవహరించిన మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా సహాయం చేస్తున్నాడన్న టాక్ వినిపించిన విషయం తెలిసిందే.
సిరి, షణ్ముఖ్ గుట్టు విప్పిన ఉమాదేవి: పక్క పక్కనే పడుకుంటారు.. ఆ పని చేయడానికే వచ్చారా అంటూ బూతులు
అయితే, ఇప్పుడు నవీన్ పోలిశెట్టి వేరే చిత్రాలతో బిజీగా ఉన్న కారణంగా అనుదీప్ కేవీ మరో హీరో కోసం కథను రెడీ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ యంగ్ డైరెక్టర్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్తో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాను చేయబోతున్నాడట. ఇప్పటికే ఆయనకు లైన్ వినిపించగా అది ఆయనకు బాగా నచ్చినట్లు వినికిడి. అంతేకాదు, పూర్తి స్క్రిప్టుతో రమ్మని సదరు దర్శకుడికి చెప్పినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే అనుదీప్ స్టోరీ మొత్తం కంప్లీట్ చేశాడని టాక్. ఇది వెంకీకి వినిపించిన వెంటనే నచ్చితే పట్టాలెక్కిస్తారనే టాక్ వినిపిస్తోంది.
అనుదీప్ కేవీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ చేయబోయే సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించబోతున్నాడని సమాచారం. తన స్వప్న సినిమాను బ్యానర్పై దీన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడట. వెంకటేష్ను ఒప్పించేందుకు సదరు దర్శక నిర్మాత కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని కూడా తనదైన శైలి కామెడీతో సరికొత్త కాన్సెప్టుతో తెరకెక్కించాడని అనుదీప్ భావిస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.