Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ముందుకు వచ్చిన యంగ్ టైగర్.. ప్రభుత్వాలకు, సినీ కార్మికులకు అండగా ఎన్టీఆర్
కరోనా దెబ్బకు దేశం మొత్తం వణికిపోతోంది. ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఏప్రిల్ 14 వరకు ఇదే పద్దతి కొనసాగుతుందని దేశం మొత్తం లాక్ డౌన్లో ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో పేదలు, పేద కళాకారులను ఆదుకునేందుకు సినీ తారలు ముందుకు వస్తున్నారు.
కరోనాను కట్టడి చేసే క్రమంలో ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేసేందుకు గానూ ముఖ్యమంత్రి సహాయ నిధికి సెలెబ్రిటీలంతా విరాళాన్ని ప్రకటిస్తున్నారు. యంగ్ హీరో నితిన్ మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ చేరుతున్నారు. తమకు తోచిన సాయాన్ని చేస్తున్నారు.
తాజాగా యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ కూడా చేరిపోయాడు. ఇలాంటి విపత్కర సమయంలో ముందుకు వచ్చిన ఎన్టీఆర్ 75లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించాడు. ఇందులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు 50 లక్షలు, సినీ శ్రామికుల సహాయార్థం రూ. 25 లక్షలను ప్రకటించాడు. ఇప్పటికే చిరంజీవి తెలుగు సినీ శ్రామికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.