Don't Miss!
- News ఎన్నికల ముందు గుడ్ న్యూస్..ఫుల్ జోష్లో వైసీపీ
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సంక్రాంతి బరిలో మెగా హీరో సినిమా: రాధే శ్యామ్ రిలీజ్ రోజునే రాబోతున్నట్లు ప్రకటన
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో చాలా మంది ఇప్పుడు స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఈ క్రమంలోనే మరికొంత మంది కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా కొన్నేళ్ల క్రితమే హీరోగా ఎంటర్ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. మెగా కాంపౌండ్ నుంచి 'విజేత' అనే సినిమాతో వచ్చిన అతడు.. ఆరంభంలోనే భారీ దెబ్బను ఎదుర్కొన్నాడు. కానీ, నటన పరంగా మాత్రం పర్వాలేదనిపించాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న అతడు.. ఆ వెంటనే రెండో సినిమాను కూడా మొదలు పెట్టేశాడు.
హైపర్ ఆది పెళ్లిపై నోరు జారిన తండ్రి: అమ్మాయిని చూసేశాం కానీ.. విష్ణుప్రియను లాగుతూ సంచలన వ్యాఖ్యలు
'విజేత' తర్వాత కల్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి' అనే సినిమాను మొదలు పెట్టాడు. పులి వాసు అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం అయింది. దీనికితోడు హీరోయిన్ల మార్పు కారణంగా రీషూట్లు కూడా జరిగాయి. దీంతో ఈ చిత్రం షూటింగ్ అనుకున్న రీతిలో సాగలేదు. ఒకానొక దశలో ఇది ఆగిపోయిందన్న టాక్ కూడా వినిపించింది. అంతేకాదు, అప్పుడు కల్యాణ్ దేవ్ మరికొన్ని ప్రాజెక్టులను కూడా మొదలు పెట్టేశాడు. దీంతో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు లేవని అంతా అనుకున్నారు.
మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటించిన రెండో చిత్రం 'సూపర్ మచ్చి' షూటింగ్ను కొద్ది రోజుల క్రితమే పున: ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ సినిమా చిత్రీకరణను నిర్వరామంగా జరుపుకుంటూ వచ్చి ఎట్టకేలకు పూర్తి చేసేశారు. దీంతో ఈ సినిమాను మళ్లీ లైన్లోకి తీసుకొచ్చేశారు. షూటింగ్ పూర్తై.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరిపినా ఎందుకనో విడుదల తేదీని మాత్రం ఇన్ని రోజులూ ప్రకటించలేదు. దీంతో మెగా అభిమానులు అయోమయానికి గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చిత్ర యూనిట్ నేరుగా సంక్రాంతి బరిలోకే దిగుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచింది.
అరాచకమైన ఫొటోలను వదిలిన యాంకర్ వర్షిణి: తొలిసారి ఇంత హాట్గా.. వామ్మో చూస్తే తట్టుకోలేరు
తెలుగు సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ ఎంతో ముఖ్యమైనది. ఆ పండుగ సమయంలో తమ సినిమాలను విడుదల చేయాలని హీరోలు, దర్శక నిర్మాతలు ఆరట పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో RRR మూవీ రిలీజ్ను వాయిదా వేశారు. దీంతో చాలా చిన్న సినిమాలు సంక్రాంతి రేసులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కల్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి' మూవీని కూడా అప్పుడు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' రాబోతున్న జనవరి 14నే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
కల్యాణ్ దేవ్ కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సూపర్ మచ్చి' మూవీని పులి వాసు తెరకెక్కించాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రిజ్వాన్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రుచితా రామ్ హీరోయిన్గా నటించింది. అలాగే, రాజేంద్రప్రసాద్, నరేష్తో పాటు ప్రగతి, అజయ్, పోసాని కృష్ణమురళి, 'జబర్దస్త్' మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్లు కీలక పాత్రలు పోషించారు. ఇక, ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు.