Don't Miss!
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డేరింగ్ స్టెప్ వేసిన మెగా అల్లుడు.. చివరి షెడ్యూల్ను పూర్తి చేసే పనిలో కళ్యాణ్ దేవ్
చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్.. సినీ కెరీర్ కాస్త నెమ్మదిగానే సాగుతోంది. మొదటి సినిమా విజేతతో తెలుగు తెరపై కనిపించాడు. ఆ చిత్రం ఓ మోస్తరుగా పర్వాలేదనిపించింది. అయితే కళ్యాణ్ దేవ్కు మాత్రం ఎటువంటి స్టార్డమ్ను తెచ్చిపెట్టలేకపోయింది. విజేత వచ్చి చాలా కాలమే అవుతున్నా రెండో ప్రాజెక్ట్ రావడానికి మాత్రం చాలానే సమయం పడుతోంది. మధ్యలో తన రెండో ప్రాజెక్ట్పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది.
ప్రస్తుతం ప్రభుత్వాలు షూటింగ్కు అనుమతులు ఇచ్చినా స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా కాలు బయట పెట్టడం లేదు. బయట కరోనా విస్తరిస్తున్న స్పీడ్ను చూసి.. పెద్ద హీరోలంతా వెనుకడుగు వేస్తున్నారు. పూర్తిగా కరోనా ప్రభావం తగ్గిన తరువాతే రంగంలోకి దిగుదామని ఎదురుచూస్తున్నారు. కానీ కళ్యాణ్ దేవ్ మాత్రం ధైర్యంగా ముందడుగు వేశాడు. తన రెండో సినిమా సూపర్ మచ్చి షూటింగ్లో పాల్గొన్నాడు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే షూటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
చివరి షెడ్యూల్ను నేడు రామానాయుడు స్టూడియోలో ప్రారంభించారు. ఈ మేరకు నిర్మాత మాట్లాడుతూ.. తొలి సినిమా విజేతతోనే నటనతో ఆకట్టుకున్న కల్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి'లో మరింత చక్కటి పర్ఫామెన్స్తో అలరిస్తారు. అటు మాస్ ఆడియెన్సుకీ, ఇటు ఫ్యామిలీ ఆడియెన్సుకీ ఆయన క్యారెక్టర్ కనెక్టవుతుంది. ఈ సినిమాకు కన్నడ హీరోయిన్ రచితా రామ్ ప్లస్ అవుతుంది.
తమన్ మ్యూజిక్ హైలైట్ అవుతుంది. అలాగే రాజేంద్రప్రసాద్, హీరో కాంబినేషన్ సీన్లు కూడా ఆకట్టుకుంటాయి. ఇది లవ్ స్టోరీ మిక్స్ చేసిన చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్' అని చెప్పుకొచ్చాడు.పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.