Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
నటి గౌతమికి షాకిచ్చిన కమల్ హాసన్.. మరో హీరోయిన్తో అంటూ...
విలక్షణ నటుడు కమల్ హాసన్ మరోసారి రీమేక్ చిత్రంతో సిద్దమవుతున్నట్టు తమిళ మీడియాలో ఓ వార్త ప్రచారం అవుతున్నది. దేశవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించిన దృశ్యం సినిమాకు రీమేక్గా దృశ్యం 2 విడుదలై అందర్నీ ఆకట్టుకొంటున్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా వెంకటేష్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తమిళంలో కూడా దృశ్యం చిత్రం పాపనాశనం టైటిల్తో రీమేక్ చేసి కమల్, గౌతమి నటించారనే విషయం తెలిసిందే.
ప్రస్తుతం కమల్ హాసన్ దృశ్యం 2 చిత్రాన్ని పాపనాశనం 2గా తెరకెక్కించేందుకు సంప్రదింపులు, కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ చిత్రంలో గౌతమికి బదులుగా నటి మీనాను హీరోయిన్గా తీసుకోవాలని అనుకొంటున్నట్టు తెలిసింది. మీనాతో కమల్ సంప్రదింపులు జరిపినట్టు ఓ వార్త మీడియాలో వైరల్ అయింది.
పాపనాశనం సినిమా సమయంలో కమల్, గౌతమి కలిసి జీవనం చేశారు. ఆ సినిమా తర్వాత వారి జీవితంలో అనేక మార్పులు, ఊహించని సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఆ తర్వాత కమల్, గౌతమి విడిపోవడం సంచలనం రేపింది. ఈ క్రమంలో గౌతమికి బదులుగా మీనాను తీసుకొవాలని కమల్ నిర్ణయించుకొన్నట్టు తెలిసింది.
కమల్ హాసన్ కెరీర్ విషయానికి వస్తే.. దర్శకుడు శంకర్ తెరకెక్కించే ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు.