Don't Miss!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- News వివేకా హత్యపై మాట్లాడొద్దు- కడప కోర్టు సంచలన ఆదేశాలు..!
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎస్పీ బాలు ఆరోగ్యం మరింత విషమం.. కమల్ హాసన్ కీలక ప్రకటన
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈ క్రమంలో ఎంజీఎం హాస్పిటల్లో ప్రముఖుల రాకపోకలతో హడావిడిగా మారింది. కమల్ హాసన్ లాంటి ప్రముఖులు హాస్పిటల్కు వెళ్లి ఎస్పీ బాలసుబ్రమణ్యంను, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఎంజీఎం హాస్పిటల్ నుంచి వెళ్తూ మీడియాతో కమల్ హాసన్ మాట్లాడుతూ ఆయన ఆరోగ్య బాగుందని చెప్పను. ఆయన కోలుకోవాలని నేను కోరుకొంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రార్థిస్తున్నారు అని తెలిపారు
ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఎంజీఎం హాస్పిటల్కు వచ్చే సందర్శకులపై ఆంక్షలు విధించారు. కేవలం 20 మందిని మాత్రమే ఎస్పీ బాలసుబ్రమణ్యం వార్డు వెళ్లే అనుమతించారు. ఈ క్రమంలో అభిమానుల్లో, సన్నిహితుల్లో ఆందోళన మొదలైంది. ఎస్పీ బాలు ఆరోగ్యం విషమించిందన్న నేపథ్యంలో ఆయన సన్నిహితులు, స్నేహితులు హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్తున్నారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం హెల్త్ బులెటిన్ను ఎజీఎం హాస్పిటల్ గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో విడుదల చేస్తూ.. ఎస్పీబాలు ఆగస్టు 5న ఎంజీఎం హెల్త్కేర్లో కరోనావైరస్ వ్యాధితో చేరారు. అప్పటి నుంచి ఆయన ఎక్మో, వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. గత 24 గంటల్లో ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. పూర్తిగా ఆయనకు లైఫ్ సపోర్ట్తోనే చికిత్స అందిస్తున్నాం. ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారింది. ఎంజీఎం ఆస్పత్రి వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది అని పేర్కొన్నారు.