Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఐరన్ మ్యాన్ను తలుచుకొని కంగన రనౌత్ ఎమోషనల్.. పదవిని త్యాగం చేసి అంటూ..
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. గుజరాత్లోని ఎత్తైన వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రధాని వల్లభాయ్ పటేల్ పాల్గొని ఐరన్ మ్యాన్కు ఘనంగా నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉక్కు మనిషికి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకొన్నారు. ఈ నేపథ్యంలో కంగన రనౌత్ ట్విట్టర్లో సర్దార్ సేవలను మరోసారి గుర్తు చేశారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కీర్తిస్తూనే.. ప్రధాని పదవిని జవహర్ లాల్ నెహ్రూకు వదిలివేయడం జాతికి కలిగిన నష్టమనే విధంగా కామెంట్ చేశారు. బ్రిటిష్ పాలన నుంచి భారత్కు విముక్తి కలిగిన తర్వాత దేశ ప్రధాని పదవికి సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ పేర్లు ప్రతిపాదించారు. నెహ్రూ మంచిగా ఇంగ్లీష్ మాట్లాడారనే భావించిన గాంధీని మెప్పించడానికి తనకు లభించే పదవిని త్యాగం చేశారు.
దేశం కోసం ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్కు నష్టం జరగలేదు. కానీ దేశానికి తీవ్ర నష్టం వాటిల్లింది. మన హక్కులను సాధించుకోవడానికి దశాబ్దాలుగా పోరాటం చేయాల్సి వస్తున్నది అని కంగన తన ట్వీట్లో పేర్కొన్నారు.
అఖండ భారత్ స్థాపనకు కలలుగన్న ఐరన్ మ్యాన్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పిస్తున్నాను. ప్రధాని పదవిని త్యాగం చేసి మీ నాయకత్వ ప్రతిభను, విజన్ను మాకు దూరం చేశారు. మీ నిర్ణయానికి మేము చింతిస్తున్నాం అంటూ మరో ట్వీట్ను కంగన రనౌత్ చేశారు.