Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి అత్యాచారం.. వీడియోతో బ్లాక్ మెయిల్.. నటి ఫిర్యాదు
కూల్ డ్రింక్లో మత్తు మందు కలిసి ఇవ్వడం, ఆపై అత్యాచారం చేయడం, ఇంకొందరు వాటిని చిత్రీకరించి డబ్బులు కాజేయడం ఎన్ని సినిమాల్లో చూసి ఉంటారు. అయితే అలాంటి పథకంలో వలకు చిక్కిన చేప పిల్లలా ఓ కన్నడ నటి పడింది. కార్పోరేట్ కంపెనీ సీఈఓ అని చెప్పి మోసం చేయడం, అత్యాచారం చేసి వీడియోలో చిత్రీకరించడం, డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం.
అలా పరిచయం..
2018 లో గాంధీబజార్ కాఫీడేకు వెళ్లిన సమయంలో ఆ కన్నడ నటికి నాయండహళ్లికి చెందిన మోహిత్ అనే వ్యక్తితో పరిచయమైంది. అతను ఓ ప్రైవేటు కంపెనీ సీఈఓ అని చెప్పి దగ్గరయ్యాడు. తన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని కోరాడు.
అలా క్లోజ్..
అలా అలా వారిద్దరు క్లోజ్ అయ్యారని తెలుస్తోంది. గతేడాది జనవరి 15న గోవాకు తీసుకెళ్లి ఫొటోషూట్ చేశాడు. కంపెనీలో ఆర్థిక సమస్యలంటూ రూ.1.50 లక్షలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాది జూన్ 22న నటి ఇంట్లోనే తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. మరుసటి రోజు నటి పుట్టినరోజు కావడంతో ఇద్దరూ కలిసి బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.
మత్తుమందు కలిపి..
ఆ పార్టీలో ఆ నటికి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి భద్రపర్చుకున్నాడు. ఆపై ఆ వీడియోను చూపి డబ్బు ఇవ్వాలని లేకపోతే సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరించాడు.
పలుమార్లు డబ్బులు..
వీడియోను
చూపిస్తూ
పలుమార్లు
డబ్బులు
గుంజాడని
తెలుస్తోంది.
ఈ
క్రమంలో
మొత్తంగా
రూ.20లక్షలు
ఆమె
దగ్గరి
నుంచి
కాజేశాడని
సమాచారం.
ఈ
ఘటన
తనకు
సాయం
చేస్తారన్న
ఆశతో
ఈ
విషయాన్ని
బాధితురాలు
నిందితుడి
తల్లిదండ్రులకు
చెప్పగా
వారు
కూడా
బెదిరింపులకు
పాల్పడ్డారు.
అందరిపై కేసు నమోదు..
దీంతో విసిగిపోయిన ఆ నటి మోహిత్తో పాటు అతడి తల్లిదండ్రులు మహాదేవ్, నాగవేణితో పాటు బంధువు రాహుల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మోహిత్ కోసం గాలిస్తున్నారు.