Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్బాబుతో కన్నడ సూపర్స్టార్.. పరుశురాం స్కెచ్ వర్కవుట్
సరిలేరు నీకెవ్వరు తర్వాత గీతా గోవిందం దర్శకుడు పరుశురాంతో టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు జతకట్టేందుకు సిద్దమవుతున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే విషయం వాయిదా పడింది. ప్రస్తుతం లాక్డౌన్లో కుటుంబంతో గడుపతుున్న ప్రిన్స్ మహేష్ తన తాజా సినిమాపై దర్శకుడు, నిర్మాతతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..
తెలుగులో హీరోగా కన్నడ స్టార్ ఉపేంద్ర పలు బ్లాక్బస్టర్ సినిమాలతో ఆలరించారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఆయన నటన కూడా హైలెట్ అయింది. ఈ క్రమంలో మరోసారి మహేష్తో కలిసి నటించేందుకు ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.
ఇప్పటికే ఉపేంద్రతో చిత్ర యూనిట్ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా కథను, రోల్ గురించి వివరించగా.. ఆయన పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాలో భాగం కావడానికి ఉత్సాహం చూపించారు. మాట రూపంలో ఈ సినిమాలో నటించేందుకు ఒకే చెప్పారు. అధికారికంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు జరుగాల్సిందే మిగిలింది అని పలువురు చెప్పారు.
మహేష్బాబు కెరీర్లో 27వ చిత్రంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి పరుశురాం దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను మే 31న సూపర్స్టార్ కృష్ణ జన్మదినం రోజున వెల్లడించే అవకాశం ఉంది.