Don't Miss!
- News హరిరామ జోగయ్య యూటర్న్-పవన్ తో పాటు కూటమికీ భారీ ఊరట..!
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
మహేష్బాబుతో కన్నడ సూపర్స్టార్.. పరుశురాం స్కెచ్ వర్కవుట్
సరిలేరు నీకెవ్వరు తర్వాత గీతా గోవిందం దర్శకుడు పరుశురాంతో టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు జతకట్టేందుకు సిద్దమవుతున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే విషయం వాయిదా పడింది. ప్రస్తుతం లాక్డౌన్లో కుటుంబంతో గడుపతుున్న ప్రిన్స్ మహేష్ తన తాజా సినిమాపై దర్శకుడు, నిర్మాతతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..
తెలుగులో హీరోగా కన్నడ స్టార్ ఉపేంద్ర పలు బ్లాక్బస్టర్ సినిమాలతో ఆలరించారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఆయన నటన కూడా హైలెట్ అయింది. ఈ క్రమంలో మరోసారి మహేష్తో కలిసి నటించేందుకు ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.
ఇప్పటికే ఉపేంద్రతో చిత్ర యూనిట్ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా కథను, రోల్ గురించి వివరించగా.. ఆయన పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమాలో భాగం కావడానికి ఉత్సాహం చూపించారు. మాట రూపంలో ఈ సినిమాలో నటించేందుకు ఒకే చెప్పారు. అధికారికంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు జరుగాల్సిందే మిగిలింది అని పలువురు చెప్పారు.
మహేష్బాబు కెరీర్లో 27వ చిత్రంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి పరుశురాం దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను మే 31న సూపర్స్టార్ కృష్ణ జన్మదినం రోజున వెల్లడించే అవకాశం ఉంది.