హీరో కార్తీ కొత్త చిత్రం ప్రారంభం.. విశేషాలు ఇవే!
తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తీ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి పాత్రలో ఓడిపోయి నటించగలిగే ప్రతిభ కార్తీ సొంతం. కార్తీ ప్రస్తుతం దేవ్ చిత్రంలో నటిస్తున్నాడు. రవిశంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ రెండో సారి కార్తీకి హీరోయిన్ గా నటిస్తోంది. ఖాకి చిత్రంలో ఇప్పటికే ఈ జంట నటించారు. తాజాగా కార్తీ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు.
నగరం చిత్ర దర్శకుడు లోకేష్ కానగరాజ్ దర్శత్వంలో రూపొందబోయే కార్తీ చిత్రం నేడు చెన్నైలో ప్రారంభమైంది. కార్తీ ఖాకి చిత్రాన్ని నిర్మించిన ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. సూర్య నటిస్తున్న ఎన్ జి కె చిత్రానికి కూడా ఇతడే నిర్మాత. లోకేష్ చెప్పన కథ ఆసక్తిగా ఉండడంతో కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కార్తీ నటించిన గత రెండు చిత్రాలు ఖాకి, చినబాబు మంచి విజయం సాధించాయి. కార్తీకి తెలుగులో కూడా మార్కెట్ ఉండడం కలసి వచ్చే అంశం. లోకేష్ కానగరాజ్ దర్శత్వంలో తెరకెక్కే చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలోనే ఉన్నాయి. ఖాకి చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన కార్తీ, చినబాబు చిత్రంలో రైతు పాత్రలో నటించాడు. ఈ చిత్ర కథ, ఇతర నటీనటుల గురించి త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











