twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కత్తి మహేష్ అంత్యక్రియలు వాయిదా.. ఎప్పుడు, ఎక్కడ, జరుగుతాయంటే?

    |

    సినీ విమర్శకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.. సుమారు 15 రోజుల పాటు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.. అయితే ఆయన అంత్యక్రియలు ఈరోజు స్వగ్రామంలో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అవి వాయిదా పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే

    రివ్యూలు ఇస్తూ

    రివ్యూలు ఇస్తూ

    టాలీవుడ్ లో యాక్టివ్గా ఉంటూ పలు సినిమాలకు రివ్యూలు అందిస్తూ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి హీరోల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కత్తి మహేష్ పాపులర్ అయ్యాడు.. తొలుత సినిమాలకు రివ్యూలు రాయడం మొదలు పెట్టిన ఆయన ఆ తరువాతి కాలంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ బాలకృష్ణ లాంటి హీరోల మీద కామెంట్స్ చేస్తూ హైలైట్ అయ్యారు.

    ప్రేమ-పెళ్లి

    ప్రేమ-పెళ్లి

    హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజం చేసిన ఆయన అక్కడే బెంగాల్కు చెందిన యువతితో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. అయితే ఒక కుమారుడు కూడా జన్మించాక అభిప్రాయ భేదాలు రావడంతో స్నేహపూర్వకంగానే విడిపోయారు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన సినిమాలకు సంబంధించిన అలాగే రాజకీయాలకు సంబంధించి మాత్రమే కాక కరెంట్ అఫైర్స్ కు సంబంధించి ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉండేవారు.

    కారు యాక్సిడెంట్

    కారు యాక్సిడెంట్

    కొన్ని రోజుల క్రితం విజయవాడ నుంచి సొంత ఊరు కారులో వెళ్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కారు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను ముందు నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ కంటికి దెబ్బ తగలడంతో శస్త్రచికిత్స కూడా చేశారు.

    అంతా బాగానే ఉందనుకున్న సమయంలో

    అంతా బాగానే ఉందనుకున్న సమయంలో

    అయితే మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి సుమారు 14 రోజుల నుంచి చికిత్స అందిస్తున్నారు. అంతా బాగానే ఉంది మరి కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకుని ఆయన ఇంకా లేచి రావటమే అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా నిన్న సాయంత్రం ఆయన కన్నుమూశారు.

    Recommended Video

    Swapnika Exclusive Interview Part 4 | Sarkaru Vaari Paata AD ​| Filmibeat Telugu
    రేపు అంత్యక్రియలు

    రేపు అంత్యక్రియలు

    అయితే నిన్న పార్థివదేహం బయలుదేరుతుంది, ఉదయాన్నే ఊరికి చేరుకుంటే ఈరోజు ఉదయం అంత్యక్రియలు చేయొచ్చని భావించారు. కానీ అందుతున్న సమాచారం మేరకు ఈ రోజు సాయంత్రం ఆయన పార్థివ దేహం స్వగ్రామానికి చేరే అవకాశం కనిపిస్తోంది. ఆయన స్వగ్రామమైన చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలం ఎల్లమంద లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

    English summary
    critic Kathi Mahesh, breathed his last on Saturday. His mortal remains will reach Yalamanda, his native village from Chennai Apollo by today evening. funeral will be held at his native village on Monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X