మహేష్ బాబుతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన కత్రినా కైఫ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉండగానే ఆయన తర్వాతి ప్రాజెక్ట్ సుకుమార్ దర్శకత్వంలో ఖరారైంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ నటి కత్రినా కైఫ్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా ఓ ప్రతిక ఇంటర్వ్యూలో కత్రినా కైఫ్.. మహేష్ బాబు సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను సల్మాన్ ఖాన్ మూవీ 'భారత్'లో నటిస్తున్నానని, ఈ సినిమా తర్వాత తాను ఏ మూవీకి సైన్ చేయలేదని తెలిపారు. మహేష్ బాబు సినిమా కోసం తనను ఎవరూ సంప్రదించలేదన్నారు.

కత్రినా స్టేట్మెంటుతో మహేష్-సుకుమార్ తర్వాతి సినిమాపై రూమర్లకు తెరపడినట్లయింది. 'మళ్లీశ్వరి' తర్వాత తెలుగు తెరకు దూరమైన కత్రినా మళ్లీ ఎప్పుడు టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తుందో అని ఎదురు చూస్తున్న అభిమానులు మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
మహేష్ బాబు-సుకుమార్ సినిమా విషయానికొస్తే... ఇటీవలే సుకుమార్ ఫైనల్ స్క్రిప్టు మహేష్ బాబుకు వినిపించినట్లు తెలుస్తోంది. 'మహర్షి' షూటింగ్ ముగిసిన వెంటనే సుకుమార్ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











