Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెలుగుచూడనున్న కీర్తి తొలిచిత్రం...ఆదిలోనే వివాదం
అందాల బొమ్మ కీర్తీ సురేశ్ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ను ఏలేస్తోందనే చెప్పాలి. పెంగ్విన్ మొదలుకుని అమ్మడి చిత్రాలన్నీ ఓటీటీలపైనే విడుదలకు సిద్ధమవుతుందటంతో రాబోయే రోజుల్లో అమ్మడు ఓటీటీ క్వీన్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం కీర్తి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చాలానే ప్రాజెక్ట్ పట్టాలెక్కుతున్నాయి. అమ్మడి పేరు ఓ బ్రాండ్ గా మారింది. ఇక దీన్ని క్యాష్ చేసుకునేందుకు, విడుదలవ్వక ముందే అటకెక్కిన ఆమె పాత సినిమాను ఇప్పుడు తెరపైకి తీసుకువస్తున్నారు నిర్మాతలు. జానకీతో నేను అనే ఈ సినిమా కీర్తి తొలి చిత్రం అని తెలుస్తోంది.
డెబ్యూ డైరెక్టర్ రామ్ ప్రసాద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది అనుకునేసరికి అనుకోని విధంగా ఈ సినిమా కాంట్రావర్శీ వలలో చిక్కుకుంది. జానకీ తో నేను నిర్మాత చంటీ అడ్డాల, ఈ సినిమా హక్కులను తనకు ఎప్పుడో అమ్మేశాడని నిర్మాత నట్టి కుమార్ ఆరోపిస్తున్నారు.
సినిమాను ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై విడుదల చేసేందుకు చంటీ అడ్డాల పావులు కదుపుతుండటంతో, నట్టి కుమార్ ఈ ఆరోపణలు చేస్తున్నారు. వేరే టైటిల్ తో తనని ఫూల్ చేస్తున్నారని వెల్లడించారు. దీంతో కీర్తి తొలి చిత్రం ఓటీటీలోనైనా వెలుగు చూస్తుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
మరోవైపు నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్న కీర్తి సురేశ్... ఇందులో మేకప్ లేకుండా కనిపించబోతోందని తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఇక తమిళంలో అన్నాట్టే అనే సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు చెల్లలుగా కీర్తి నటించబోతున్న సంగతి తెలిసిందే.