Don't Miss!
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- News నెల్లూరు జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్-14 రోజుల రిమాండ్..!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డోస్ పెంచిన కీర్తి సురేష్.. మరోసారి నితిన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్!
మహానటి సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న కీర్తి సురేష్ సినిమాలను ఒకే చేయడంలో చాలా స్లోగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. అసలు ఆమెకు ఆఫర్లు రావడం లేదా? లేక వస్తున్నా కూడా కావాలనే రిజెక్ట్ చేస్తోందా అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక మొత్తానికి అలాంటి రూమర్స్ కి చెక్కే పెట్టె విధంగా సినిమాలు చేస్తోంది.
ఇటీవల పెంగ్విన్ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్ అనుకున్నంతగా అయితే పాజిటివ్ టాక్ అందుకోలేదు. ఇక ఆమె సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఆఫర్స్ అయితే గట్టిగానే వస్తున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మరోసారి నితిన్ తో సినిమా చేయడానికి ఒప్పుకుంది. ప్రస్తుతం నితిన్ తో రంగ్ దే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక నెక్స్ట్ నితిన్ చేయబోయే పవర్ పేట సినిమాలో కూడా కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రంగ్ దే సినిమాలో ఆమె నటనకు ఫిదా అయిన హీరో నితిన్ దర్శకుడు కృష్ణ చైతన్య..పవర్ పేట సినిమాలో ఒక ఎమోషనల్ పాత్రకు కీర్తి కరెక్ట్ గా సెట్ అవుతుందని ఫైనల్ చేశారట. ఇప్పటికే కీర్తి చెతిలో తమిళ్ మూడు తమిళ్ సినిమాలు ఉన్నాయ్. ఆ సినిమాలతో పవర్ పేట షూటింగ్ ని కూడా ఒకేసారి ఫినిష్ చేయనుందట ఈ బ్యూటీ.