Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజనీ-శివ కాంబో.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ఓపెనింగ్.. హాజరుకాని హీరోయిన్
సూపర్ స్టార్ రజినీకాంత్ వేగం చూస్తుంటే కుర్ర హీరోలకు మతి పోవాల్సిందే. ఒక ప్రాజెక్ట్ అయిన వెంటనే విశ్రాంతి తీసుకునే హీరోలున్న ఈ కాలంలో.. రజనీ వేగం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఓ ప్రాజెక్ట్ పట్టాలపై ఉండగానే.. మరోటి లైన్లో పెట్టేస్తున్నాడు. రజినీ తాజా చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించేశాడు.
|
శివ దర్శకత్వంలో మూవీ..
తమిళ నాట అజిత్-శివ కాంబినేషన్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేదాలం, వీరం, విశ్వాసం, వివేగం లాంటి వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోయిన దర్శకుడు శివ.. ప్రస్తుతం తలైవార్ కోసం ఓ పవర్ఫుల్ కథను సిద్దం చేశాడు. ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించేశారు.
|
కార్యక్రమంలో సందడి చేసిన మీనా, కుష్బు..
సన్ పిక్చర్స్ కాంబినేషన్లో రజినీ చేస్తోన్న ఈ మూవీలో మీనా, కుష్బు, కమెడీయన్ సూరి, ప్రకాశ్ రాజ్ లాంటి వారు ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో మీనా, కుష్బు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
హాజరుకాని హీరోయిన్
ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఎంపికైనట్లు రెండ్రోజుల క్రితమే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతూ తన ఆనందాన్ని పంచుకుంది కీర్తి సురేష్. ఆయన్ను చూస్తూ ఉండిపోయే స్టేజ్ నుంచి.. ఆయనతో కలిసి నటించే స్థాయి వరకు రావడంతో ఎంతో ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ పూజా కార్యక్రమాలకు మాత్రం కీర్తి హాజరు కాలేదు. మిగతా ప్రాజెక్ట్లో బిజీగా ఉండటం వల్లే హాజరుకాలేదని తెలుస్తోంది.
|
నెగెటివ్ రోల్లో మీనా..
ఈ చిత్రంలో రజినీని ఎదిరించే పాత్రలో మీనా నటించబోతోన్నట్లు తెలుస్తోంది. మీనా పెళ్లి తరువాత తన ఆచితూచి ప్రాజెక్ట్లను ఎంచుకుంటూ వస్తోంది. రీసెంట్గా వెబ్ సిరీస్లోకి అడుగుపెట్టేసింది. మరి ఈ చిత్రంలో మీనా ఎలా నటిస్తుందో చూడాలి. రజినీ-ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తోన్న దర్బార్ సంక్రాంతికి విడుదల కానుంది.