Don't Miss!
- News amit shahకు సొంత కారు లేదట.. అవాక్కయ్యేలా అమిత్ షా ఆస్తులు, అప్పులు!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
భయానకంగా కీర్తి సురేష్ పెంగ్విన్ ట్రైలర్.. ఓటీటీలో మొదటి హిట్టు కొట్టేలా ఉంది!
కరోనా వైరస్ ధాటికి సినిమా థియేటర్స్ మూత పడటంతో చిన్న సినిమాలు చాలా వరకు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోకి దిగుతున్నాయి. అదే తరహాలో కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా కూడా త్వరలో ఆన్లైన్ లో రిలీజ్ కాబోతోంది. థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే నాని రిలీజ్ చేశాడు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో కీర్తి సురేష్ హిట్టు కొట్టేలా ఉందనిపిస్తోంది.
Recommended Video
హీరోలతో ట్రైలర్..
ఇటీవల నలుగురి హీరోయిన్లతో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయించిన విషయం తెలిసిందే. తెలుగులో సమంత, హిందీ నుంచి తాప్సి, తమిళ్ లో త్రిష, ఇక మళయాళంలో మంజు వారియర్ పెంగ్విన్ టీజర్ ని సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేసి వైరల్ అయ్యేలా చేశారు. ఇక ఇప్పుడు పెంగ్విన్ ట్రైలర్ ని తెలుగులో నాని రిలీజ్ చేయగా, మళయాళంలో మోహన్ లాల్, తమిళ్ లో ధనుష్ రిలీజ్ చేశారు.
సైకో థ్రిల్లర్..
సైకో థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక తల్లి పాత్రలో కనిపించనుంది. అడవిలో సైకో కిడ్నాప్ చేసిన తన కొడుకును హీరోయిన్ ఎలా కాపాడుకుంది అనే విషయాన్ని ట్రైలర్ లో బాగా హైలెట్ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కీర్తి సురేష్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ని టచ్ చేసింది. ఆమె కొడుకును కిడ్నాఓ చేసిన సైకో ఎవరు, కీర్తి సురేష్ అతనిని ఎలా ఎదుర్కొంది అనే అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
డైరెక్ట్ ఓటీటీ రిలీజ్..
భయాన్ని కలిగించే సన్నివేశాలు కూడా సినిమాలో చాలానే ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. ఇక సినిమా ఆమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 19న రిలీజ్ కానుంది. తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుందని ఎంత ఆలస్యమైనా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆర్థికంగా దెబ్బతినకుండా ఎంతో కొంత లాభంతో బయటపడాలని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.
లాక్ డౌన్ కారణంగా..
రజినీకాంత్ పేట సినిమాను డైరెక్ట్ చేసిన యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ నిర్మాతగా ఉన్న ఈ సినిమాకు ఆయన శిష్యుడు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించాడు. సినిమా కోసం పూర్తిగా యంగ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేయడం విశేషం. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ లో రిలీజ్ కాలేకపోతోంది. ఇక ఫైనల్ గా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ కానుంది.