కేజీఎఫ్ 2 అప్ డేట్: ఇందిరాగాంధీ పాత్రలో రవీనా టాండన్
గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని వర్గాలను ఆకట్టుకొన్నది. ఆ సినిమా సాధించిన వసూళ్లు ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేశాయి. కన్నడ చరిత్ర కలెక్షన్ల రికార్డులను కేజీఎఫ్ తిరుగరాసింది. యష్ను సూపర్ స్టార్గా చేసింది. అలాంటి చిత్రానికి సీక్వెల్గా కేజీఎఫ్ 2 సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్రను బాలీవుడ్ నటి రవీనా టాండన్ పోషిస్తున్నారనే వార్త దేశవ్యాప్తంగా మీడియాలో చర్చనీయాంశమైంది.
కేజీఎఫ్ అందించిన సక్సెస్ ఉత్సాహంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2ను జాతీయ ప్రాజెక్ట్గా మలిచారు. హిందీ, తమిళం, తెలుగు రంగాలకు చెందిన స్టార్లను ఈ సినిమాలో నటింపజేస్తున్నారు. ఈ చిత్రంలో రవీనా టాండన్ నటిస్తున్నారు. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరగాంధీగా కనిపించబోతున్నారు అని చిత్ర నిర్మాతలు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం నిషేధించిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కథా నేపథ్యంగా కేజీఎఫ్ను తెరకెక్కించారు. ఈ చిత్రం కథ 1951లో మొదలై ఈ రోజు వరకు సాగుతుంది. కోలార్ గోల్డ్ మైన్స్కు ఇందిరా గాంధీకి కథలో సంబంధమేమిటనే అంశం అందరిలో ఆసక్తిని రేపుతున్నది. ఈ చిత్రంలో సంజయ్ దత్, రావు రమేస్ లాంటి నటులు కీలక పాత్రలను పోషిస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











