Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫలక్నుమా ప్యాలెస్లో యష్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ
కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను కూడగట్టుకొన్న యష్ తన రెండో చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు దృష్టిపెట్టారు. కేజీఎఫ్కు సీక్వెల్గా KGF: చాఫ్టర్ 2 చిత్రాన్ని శరవేగంగా హైదరాబాద్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ లాంటి మేటి యాక్టర్లు భాగమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా మారిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
బళ్లారి ప్రాంతంలో షూటింగ్కు అనుమతించకపోవడం వల్ల కేజీఎఫ్ షూటింగ్ను హైదరాబాద్కు మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ప్రధాన తారాగణంపై కొన్ని కీలక, ముఖ్యమైన సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. షూటింగ్లో భాగంగా కేజీఎఫ్2 సినిమా షూట్ను ఇటీవల హైదరాబాద్లోని ఫలక్నామా ప్యాలెస్లో కొన్ని సీన్లను చిత్రీకరించగా.. పెద్ద ఎత్తున్న ఫ్యాన్స్ తరలివచ్చారట.
తన అభిమాన నటుడిని చూసేందుకు చాలా మంది ఫ్యాన్స్ లంచ్ కోసం టేబుల్స్ బుక్ చేసుకొని షూటింగ్ను ఆస్వాదించారట. దాంతో తమ సినిమాకు, యష్కు ఉన్న క్రేజ్ను చూసి దర్శకుడు ప్రశాంత్ నీల్ అవాక్కయ్యారనేది తాజా సమాచారం. టాలీవుడ్లో యష్కు ఇంత క్రేజ్ ఉంటుందని ఊహించలేదని, ఇంత మంది తరలిరావడం చాలా సంతోషం వేసిందని చిత్ర యూనిట్ పేర్కొన్నది.