Don't Miss!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
‘ఆచార్య’లో మారిన హీరోయిన్: ఆమె స్థానంలో బాలీవుడ్ బ్యూటీ ఎంపిక
రీఎంట్రీలో స్పీడు చూపిస్తున్నారు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. కమ్బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150'తో భారీ విజయాన్ని అందుకున్న ఆయన.. ఆ తర్వాత వచ్చిన 'సైరా: నరసింహారెడ్డి' మాత్రం నిరాశ పరిచింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారాయన. ఇందులో భాగంగానే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'ఆచార్య'లో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండే ఆయన పాత్ర సినిమాకే హైలైట్గా నిలవనుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో అతడికి జోడీగా రష్మిక మందన్నా నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా దీనిపై మరో న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదే.. ఈ మూవీలో రామ్ చరణ్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీని తీసుకున్నారట. ఈ సినిమా లెవెల్ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోన్న షెడ్యూల్లో చిరంజీవిపై ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. కొద్ది రోజుల్లో రామ్ చరణ్ పార్ట్ను కూడా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఆ సమయంలోనే కియారాను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో వీళ్లిద్దరూ కలిసి బోయపాటి శ్రీను రూపొందించిన 'వినయ విధేయ రామ'లో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చాలా గ్యాప్ తర్వాత మరోసారి జత కడుతున్నారీ ఇద్దరు.