Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
తెలుగుపై కియారా మమకారం, మరిన్ని సినిమాలు చేస్తేస్తానంటోన్న వయ్యారం
బాలీవుడ్ లో హీరోయన్ గా నిలదొక్కుకుంటోన్న సమయంలోనే టాలీవుడ్ లో వడివడిగా అడుగులు వేసిన కియారా అద్వానీ, వస్తూనే రామ్ చరణ్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలతో ఆడిపాడి జనాలపై ఓ చెరగని ముద్ర వేసింది. ఆ తరువాత బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కియారా, ఇక మళ్లీ ఇటువైపు చూస్తుందో లేదో అన్న డైలమాలో పడ్డ జనాలకు క్లారిటీ ఇచ్చేసింది.
ఇటీవలే గిల్టీ అనే వెబ్ ఫిల్మ్ లో నటించిన కియారా నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంది. దీంతో అమ్మడికి ఆఫర్ల తాకిడి కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్, ఓం రౌత్ ఆదిపురుష్ లోనూ సీతగా కియారా పేరునే పరిశీలిస్తున్నారు అంటే, అమ్మడు ఏ రేంజ్ లో హడావిడి చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు.
బాలీవుడ్ లో బిజీగా మారుతోంది కాబట్టి, అమ్మడు ఇక మళ్లీ టాలీవుడ్ వైపు ఎందుకు చూస్తుందిలే అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. కియారా మళ్లీ తెలుగులో నటించబోతోందట. ఇటీవలే ఇన్స్టా చాట్ ద్వారా ఫ్యాన్స్ తో ముచ్చటించిన కియారా, తెలుగులో మళ్లీ నటిస్తారా అన్న ప్రశ్నకు అవునని సమాధానమిచ్చింది. అంతేకాదు, తెలుగునా పలు బడా సినీ నిర్మాణ సంస్థకు అమ్మడి డేట్లు పొందేందుకూ క్యూ కట్టేశాయని తెలుస్తోంది. ఏమైనా, స్టార్ డమ్ కు రీచ్ అవుతున్నా మూలాలను మరచిపోని ఈ చిన్నది మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.