Don't Miss!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
తెలంగాణ మంత్రిని కలిసిన కొరటాల శివ: ‘ఆచార్య’ షూటింగ్ పర్మీషన్ కోసమే భేటీ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అతడు షూటింగ్ స్పాట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ.. తెలంగాణ మంత్రితో భేటీ అయ్యాడు.
ఇల్లందులోని బొగ్గు గనుల్లో 'ఆచార్య' షూటింగ్ జరపాలని నిర్ణయించిన దర్శకుడు కొరటాల శివ.. దానికి సంబంధించిన అనుమతుల కోసం ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో తాజాగా భేటీ అయ్యాడు. దీనిపై సానుకూలంగా స్పందించిన తెలంగాణ మంత్రి.. వెంటనే పర్మీషన్ ఇచ్చేశారు. అంతేకాదు, హీరో చిరంజీవి బస చేసేందుకు ఖమ్మంలోని తన ఇంట్లో సౌకర్యాలను కూడా కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మార్చి 7 నుండి 15వ తేదీ వరకు ఇల్లందు జేకే మైన్స్ ఓపెన్ కాస్ట్ మరియు అండర్ గ్రౌండ్ మైనింగ్లో షూటింగ్ నిర్వహించనున్నారు.
మెగా మల్టీస్టారర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్తో పాటు చిరంజీవి నక్సలైట్లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనూ షూటింగ్ నిర్వహించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో వేసిన టెంపుల్ టౌన్ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలా ఉండగా, ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో 'ఆచార్య' బిజినెస్ కూడా భారీగా జరిగినట్లు సమాచారం.