Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగాస్టార్ తో క్రాక్ దర్శకుడు.. స్పెషల్ మీటింగ్.. ఎందుకంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ వద్ద క్రాక్ సినిమా ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నిజంగా ఈ విజయాన్ని సినిమా ఇండస్ట్రీలో ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. సినిమాకు మొదటిరోజే మాస్ రాజా అభిమానుల నుంచి హై వోల్టేజ్ టాక్ వచ్చేసింది. అక్కడి నుంచి ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుంటూ రవితేజ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది.
ఇప్పటికే పెట్టిన పెట్టుబడులను వెనెక్కి తెచ్చిన మాస్ రాజా 40% శాతానికి పైగా లాభాలతో ముందుకు సాగుతున్నాడు. ఇక ఎక్కువగా డైరెక్టర్ గోపీచంద్ మలినేనిపై సినీ పెద్దలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల దర్శకుడుని ప్రత్యేకంగా కలుసుకొని సినిమా గురించి మాట్లాడరట. ఆ విషయాన్ని గోపిచంద్ మాలినేని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
Photos: లావుగా ఉండే సెలబ్రెటీలు..ఇప్పుడు ఎంత నాజూగ్గా మారిపోయారో
ఇది నాకు మెగా డే.. ఈ విజయంతో మెగాస్టార్ నుంచి వచ్చిన ప్రశంసలు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. చిరంజీవి గారితో దగ్గరగా ఇలా ఇంటరాక్ట్ అవ్వడం నాకు ఒక ఎడ్యుకేషన్ లాంటిది. చిన్న సమావేశంలో ఎన్నో ముఖ్యమైన విషయాలను నేర్చుకున్నట్లు చెప్పాడు. ఇక గోపీచంద్ మెగాస్టార్ ను కలిసేవరకు వచ్చింది అంటే ఆయనకు కథ చెప్పే ఆస్కారం లేకపోలేదు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.