Don't Miss!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కృష్ణవంశీ కోసం రమ్యకృష్ణ ఏం చేస్తోందో తెలుసా!
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్గా కృష్ణవంశీ గుర్తింపు పొందారు. నిన్నే పెళ్లాడతా లాంటి కుటుంబ చిత్రాల్ని తెరకెక్కించినా, ఖడ్గం లాంటి విభిన్న చిత్రాన్ని రూపొందించినా ఆయన ప్రత్యేకత కనిపించేది. ప్రస్తుతం కృష్ణవంశీకి సరైన విజయాలు లేవు. కృష్ణ వంశి చివరగా రూపొందించిన చిత్రం నక్షత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచింది.
ప్రస్తుతం కృష్ణ వంశి కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. నాగార్జునకు కృష్ణవంశి నిన్నేపెళ్లాడతా లాంటి సూపర్ హిట్ ని అందించాడు. చంద్రలేఖ చిత్ర సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు వార్తలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం నాగార్జునతో కానీ ఆయన వారసులతో కానీ కృష్ణ వంశి సినిమా చేయాలనీ భావిస్తున్నారట.
కృషవంశీ ప్రయత్నాలకు ఆయన సతీమణి రమ్యకృష్ణ సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జునతో రమ్యకృష్ణకు మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో కృష్ణ వంశీతో సినిమా చేసేందుకు నాగార్జునని ఒప్పించే ప్రయత్నం చేస్తోందట. చూద్దాం.. రమ్యకృష్ణ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయో.