Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మోత మోగిస్తున్న మహేష్ బాబు హీరోయిన్.. 2 కోట్ల మందితో!
తెలుగులో అదృష్టం కలిసి రాక బాలీవుడ్కు చెక్కేసిన అందాల భామ కృతిసనన్ సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నది. ఇటీవల లుకా చుప్పీ సినిమాతో సక్సెస్ చేజిక్కించుకొన్న కృతి ఇన్స్టాగ్రామ్లో 20 మిలియన్ల ఫాలోవర్స్ను సంపాదించుకొన్నది. అంటే దాదాపు రెండు కోట్ల మంది అభిమానులు తనను ఫాలో కావడం విశేషంగా మారింది. ఈ అరుదైన ఘనతను సొంత చేసుకొన్న నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పెట్టి అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది.
2015 జనవరి 15 నుంచి కృతిసనన్ ఇన్స్టాగ్రామ్ను ఉపయోగిస్తున్నది. బాలీవుడ్ హీరోయిన్లలో అతివేగంగా ఎక్కువ ఫాలోవర్స్ను సొంతం చేసుకొన్న తారగా క్రెడిట్ కొట్టేసింది. ఐదు సంవత్సరాల్లో 20 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అని కృతి పేర్కొన్నది.
ఇటీవల కృతి నటించిన లుకా చుప్పీ సినిమా ఆమె కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. గతంలో 1: నేనొక్కడినే సినిమాలో సూపర్స్టార్ మహేష్ బాబు సరసన నటించిన సంగతి తెలిసిందే.