Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సవాల్ను స్వీకరించిన ఖుష్బూ.. రోజాతో కలిసి దిగిన ఫోటోలు వైరల్
రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం అలా కొనసాగుతూనే ఉంది. నిన్నటికి నిన్న యాక్షన్ కింగ్అర్జున్ మొక్కలు నాటి రోజా భర్త, దర్శకుడు సెల్వమణికి, కుష్బూకు చాలెంజ్ విసిరాడు. రోజాతో కలిసి మొక్కలు నాటిన అర్జున్ అనంతరం ఈ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించాడు.
తాజా రాజకీయ నాయకురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ.. అర్జున్ విసిరిన చాలెంజ్ను స్వీకరించింది. మొత్తానికి తన 'గ్రీన్ ఛాలెంజ్'ను పూర్తి చేసింది. ఈ చాలెంజ్లో భాగంగా మూడు మొక్కలను నాటింది. అంతేకాకుండా.. మరో ముగ్గురు సెలెబ్రెటీలకు ఆమె గ్రీన్ ఛాలెంజ్ విసిరింది. గ్రీన్ చాలెంజ్లో భాగంగా ఖుష్బూ మొక్కలు నాటిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, 'రోజా వనం' సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఖుష్బూ మూడు మొక్కలు నాటారని చెప్పుకొచ్చింది. సినీ నటులు మీనా, సుహాసిని, డ్యాన్సర్ బ్రిందాకు ఖుష్బూ గ్రీన్ ఛాలెంజ్ విసిరిందని పేర్కొంది. 'మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని రక్షించుకుందాం' స్లోగన్ ని చేశారు.