Don't Miss!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సవాల్ను స్వీకరించిన ఖుష్బూ.. రోజాతో కలిసి దిగిన ఫోటోలు వైరల్
రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం అలా కొనసాగుతూనే ఉంది. నిన్నటికి నిన్న యాక్షన్ కింగ్అర్జున్ మొక్కలు నాటి రోజా భర్త, దర్శకుడు సెల్వమణికి, కుష్బూకు చాలెంజ్ విసిరాడు. రోజాతో కలిసి మొక్కలు నాటిన అర్జున్ అనంతరం ఈ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించాడు.
తాజా రాజకీయ నాయకురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ.. అర్జున్ విసిరిన చాలెంజ్ను స్వీకరించింది. మొత్తానికి తన 'గ్రీన్ ఛాలెంజ్'ను పూర్తి చేసింది. ఈ చాలెంజ్లో భాగంగా మూడు మొక్కలను నాటింది. అంతేకాకుండా.. మరో ముగ్గురు సెలెబ్రెటీలకు ఆమె గ్రీన్ ఛాలెంజ్ విసిరింది. గ్రీన్ చాలెంజ్లో భాగంగా ఖుష్బూ మొక్కలు నాటిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, 'రోజా వనం' సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఖుష్బూ మూడు మొక్కలు నాటారని చెప్పుకొచ్చింది. సినీ నటులు మీనా, సుహాసిని, డ్యాన్సర్ బ్రిందాకు ఖుష్బూ గ్రీన్ ఛాలెంజ్ విసిరిందని పేర్కొంది. 'మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని రక్షించుకుందాం' స్లోగన్ ని చేశారు.