Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Lata Mangeshkar అంత్యక్రియలు పూర్తి.. కదలివచ్చిన బాలీవుడ్.. ప్రధాని మోదీ!
గానకోకిల లతా మంగేష్కర్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ముంబయిలోని లతా నివాసం నుంచి శివాజీ పార్కు వరకు అంతిమయాత్ర జరిగింది. ఈ యాత్రకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పలువురు సినీ తారలు, ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్క్ మైదానంలో ఆ లెజెండరీ సింగర్ అంత్యక్రియలు జరిగాయి. ఆమె అంత్యక్రియల్లో మోదీ సహా బాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఆ వివరాలు
Recommended Video
అంతిమ యాత్రలో వేలాది మంది
అంతకుముందు ఆర్మీ సిబ్బంది లతాజీ మృతదేహాన్ని త్రివర్ణ పతాకంలో చుట్టి ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. దీని తర్వాత, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ మరియు మహారాష్ట్ర పోలీసుల సైనికులు గౌరవార్ధం పూలతో అలంకరించిన ఆర్మీ ట్రక్కులో ఆమె మృతదేహాన్ని ఉంచి శివాజీ పార్కుకు తరలించారు. లతా మంగేష్కర్ కి చివరి వీడ్కోలు పలికేందుకు ముంబైలోని వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆమె మృతదేహం మధ్యాహ్నం 1.10 గంటలకు బ్రీచ్ కాండీ హాస్పిటల్ నుండి ఆమె ఇంటికి చేరుకుంది.
ఏడుస్తున్న దృశ్యాలు
పూలతో అలంకరించిన ఆర్మీ ట్రక్కులో ఆయన భౌతికకాయాన్ని శివాజీ పార్కుకు తీసుకొచ్చారు. శివాజీ పార్క్లో 'మేరీ ఆవాజ్ హాయ్' పాటను ప్లే చేశారు. "మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై" పాటను ప్లే చేయడం ద్వారా అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. శివాజీ పార్క్లో లతాజీ పాటలు వింటూ చాలా మంది అభిమానులు ఏడుస్తున్న దృశ్యాలు కనిపించాయి. జనం భారీగా రావడంతో అంత్యక్రియల స్థలం చుట్టూ బారికేడింగ్లు ఏర్పాటు చేశారు. లతా మంగేష్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండడంతో పాటు ఆమె పాటలు విని అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మోదీ సహా పలువురు ప్రముఖులు
లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ముంబై చేరుకుని సరాసరిగా శివాజీ పార్క్కు చేరుకున్నారు. ఆమెకు నివాళులు అర్పించిన పిమ్మట ఆయన వెనుతిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కూడా శివాజీ పార్క్ కు వచ్చారు. షారుక్ కాకుండా, సచిన్ టెండూల్కర్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, రాజ్ థాకరే, పీయూష్ గోయల్ సహా పలువురు ప్రముఖులు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అమీర్ ఖాన్, రణబీర్ కపూర్
అంతేకాకుండా శివాజీ పార్క్ వద్ద భారతరత్న లతా మంగేష్కర్కు నటులు అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, సంగీత స్వరకర్త శంకర్ మహదేవన్ నివాళులర్పించారు. అలాగే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ముంబైలోని శివాజీ పార్క్ వద్ద లతా మంగేష్కర్కు నివాళులర్పించారు.
మేనల్లుడు ఆదిత్య
చెల్లెలు
ఆశా
భోంస్లేతో
సహా
లతా
మంగేష్కర్
కుటుంబం
మొత్తం
శివాజీ
పార్క్కు
వచ్చారు.
అంత్యక్రియలకు
ముందు
ప్రముఖ
గాయని
లతా
మంగేష్కర్
మృతదేహం
ఆమె
నివాసం
నుంచి
ముంబైలోని
శివాజీ
పార్క్కు
చేరుకుంది.
లతా
జీ
సోదరుడు
హృదయనాథ్
మంగేష్కర్
కుమారుడు
లతా
మేనల్లుడు
ఆదిత్య
ఆమె
చితికి
నిప్పు
అంటించారు.