Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నారప్ప సీక్వెల్ పై షాకింగ్ న్యూస్.. దర్శకుడి ఫోకస్ ఆ సినిమాపైనే?
ఇటీవల డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన టాలీవుడ్ మూవీ నారప్ప ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది. పూర్తి స్థాయిలో అయితే అన్ని వర్గాల వారిని మెప్పించలేకపోయింది. వెంకటేష్ - ప్రియమణి జంటగా నటించిన ఈ సినిమా అసురన్ కు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. తమిళ్ లో బాక్సాఫీస్ హిట్ గా నిలవడంతో అసురన్ ను అప్పుడే తెలుగులో కుడా డబ్ చేయాలని అనుకున్నారు. కానీ లోకల్ ఫ్లేవర్ తో వేరేవాళ్ళు రీమేక్ చేస్తేనే బావుంటుందని ఆ మూవీని డబ్ చేయలేదు.
అసురన్ నిర్మాత కలైపులి ఎస్. థాను కూడా సినిమాను తెలుగులో మరొక హీరోతో నిర్మించాలని ముందే ఫిక్స్ అయ్యాడు. అందుకే రీమేక్ రైట్స్ ఎన్ని వచ్చినా కూడా సినిమాను అమ్మలేదు. నిర్మాత సురేష్ బాబుతో కలిసి సినిమాను నిర్మించిన కలైపులి ఎస్. థాను థియేట్రికల్ గానే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ వలన థియేటర్స్ పై నమ్మకం లేకపోవడంతో మొత్తానికి ఓటీటీ ఆఫర్ తో సేఫ్ జోన్ లోకి వచ్చి కాస్త లాభాన్ని అందుకున్నారు.
తమిళ్ అసురన్ సినిమాను వెట్రిమారన్ డైరెక్ట్ చేయగా తెలుగులో శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశాడు. ఇక సినిమాకు సీక్వెల్ ఉంటుందని చాలా రోజులుగా కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. తమిళ్ లో రాకపోయినా తెలుగులోనే శ్రీకాంత్ అడ్డాల ద్వారా రావచ్చని టాక్ గట్టిగానే వచ్చింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల సీక్వెల్ విషయంలో ఎలాంటి ఆలోచనతో లేడట. ఇక నెక్స్ట్ సినిమా అగ్ర హీరోతోనే ఉంటుందని ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చాడు. 'అన్నాయ్' అనే టైటిల్ తో రానున్న ఆ సినిమా రాయలసీమ అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. ఫుల్ ఫ్యాక్షన్ కథగా తెరకెక్కుతుందని సమాచారం. ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్న శ్రీకాంత్ త్వరలోనే నటీనటులను ఒప్పించి అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.