Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
లావణ్య త్రిపాఠి కుటుంబం పెద్దదైంది: మైలురాయిని అందుకున్న బ్యూటీ
'అందాల రాక్షసి' అనే సినిమాతో టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయం అయింది సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. అందులో అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె.. చాలా తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకుంది. తన క్యూట్నెస్తో ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ.. కొన్నేళ్లుగా అడపాదడపాగా కనిపిస్తోంది. గ్లామరస్ పాత్రలకు రెడీ అన్న సంకేతాలు ఇచ్చినా.. ఆమెకు అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు.
చేతి నిండా సినిమాలు లేకపోవడంతో లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన సినీ, పర్సనల్ లైఫ్కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్తో పంచుకుంటోంది. ఫలితంగా తన ఫాలోవర్లను క్రమంగా పెంచుకుంటోంది. ఇప్పటికే ఫేస్బుక్ 1 మిలియన్ పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ బ్యూటీ... ట్విట్టర్ 2 మిలియన్లను ఎప్పుడో దాటేసింది. ఈ నేపథ్యంలో తాజాగా లావణ్య త్రిపాఠి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 2 మిలియన్ల ఫాలోవర్లను చేరుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది
ఇటీవల 'అర్జున్ సురవరం' అనే సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న లావణ్య త్రిపాఠి... ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. కార్తికేయ హీరోగా చేస్తున్న 'చావు కబురు చల్లగా' అనే సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. దీనితో పాటు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'ఏ1 ఎక్స్ ప్రెస్'లోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.