Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
‘లవ్ స్టోరీ’ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్పై తాజా అప్డేట్: రెండు డేట్లూ ఫిక్స్ అయ్యాయట
ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ఈ క్రమంలోనే విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ములతో 'లవ్ స్టోరీ' అనే సినిమా చేస్తున్నాడు. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఫీమేల్ లీడ్గా చేస్తోంది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ విడుదలైన అన్ని పోస్టర్లు, పాటలు, టీజర్కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.
'లవ్ స్టోరీ' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే చిత్రంలోని పాటలు, టీజర్ విడుదల చేసింది. అలాగే, ఏప్రిల్ 8న ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఏప్రిల్ 13న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోన్న నేపథ్యంలో చాలా తక్కువ మందితో ఈ ఫంక్షన్ను చాలా తక్కువ మందితో నిర్వహించనున్నారని సమాచారం.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లవ్ స్టోరీ'లో నాగ చైతన్య డ్యాన్స్ మాస్టర్గా నటిస్తున్నాడని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. అలాగే, సాయి పల్లవి కూడా డ్యాన్సర్గానే కనిపించనుందని అంటున్నారు. ఇటీవల విడుదలైన పాటల్లో వాళ్లిద్దరూ పోటాపోటీగా డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇది ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.