Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
MAA Elections 2021: ముఖం చాటేసిన అగ్రహీరోలు, హీరోయిన్లు.. ఎవరెవరూ ఓటు వేయలేదంటే?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్తతలు, వాడివేడి కామెంట్లు, ఘర్షణ వాతావరణం మధ్య జరిగాయి. ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు ప్యానెల్స్ జోరుగా ప్రచారం చేయడంతో ఈ ఎన్నికలు వివాదాస్పదంగా మారడమే కాకుండా మరింత ఆసక్తిగా మారింది. అయితే భారీ అంచనాలు, ఊహాగానాల మధ్య ఎన్నికలు గొడవల మధ్య కొనసాగాయి. అయితే అగ్రనటులు ఓటింగ్కు ముఖం చాటేయడం చర్చనీయాంశమైంది. ఎవరెవరూ ఓటింగ్కు హాజరు కాలేదంటే..
900 మందికిపైగా ఓటర్లు
మా ఎన్నికల్లో మొత్తం 900 మందికిపైగా సభ్యులు ఉన్నారు. అందులో 800 మందికిపైగా చెల్లుబాటు అయ్యే ఓటర్లు ఉన్నారు. మధ్యాహ్నం నాలుగు గంటలకు పోలింగ్ పూర్తి అయింది. రాత్రి 9 గంటల లోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతున్నాయి.
ఓటు హక్కు వినియోగించుకొన్న ప్రముఖులు
జూబ్లిహిల్స్లోని ప్రముఖ విద్యాసంస్థలో పోలింగ్ బూత్ను ఏర్పాటు చేయగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల కార్యవర్గానికి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయాన్నే మోహన్ బాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, బాలకృష్ణ, రాంచరణ్, నాగార్జున, అఖిల్, నిఖిల్, రాజ్ తరుణ్, బండ్ల గణేష్, శివాజీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకొన్నారు.
హీరోయిన్లలో ఎవరు ఓటు వేశారంటే..
ఇక హీరోయిన్లలో జెనీలియా ముంబై నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకొన్నారు. నిత్య మీనన్, అనుపమ పరమేశ్వరన్, మెహ్రీన్, స్నేహా ఉల్లాల్, ప్రియమణి, ప్రగతి, అనితా చౌదరీ, కృష్ణవేణి, రాశీ, అమని, ఇంద్రజ, తదితరులు ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే హైదరాబాద్లో ఉండి కూడా కొందరు అగ్రహీరోయిన్లు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
ముఖం చాటేసిన స్టార్ హీరోలు..
మా ఎన్నికల్లో ఓటు వినియోగించుకొని అగ్ర హీరోలలో మహేశ్బాబు,ప్రభాస్,అల్లు అర్జున్, ఎన్టీఆర్,వెంకటేశ్,రానా దగ్గుబాటి, నాగచైతన్య ఉన్నారు. విజయ్ దేవరకొండ, ఆనంద దేవరకొండ ముందస్తుగా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకొనేందుకు వెళ్లగా ఓటింగ్కు హాజరుకాలేదు.
Recommended Video
ఓటు హక్కు వినియోగించుకోని రకుల్, పూజా హెగ్డే, హన్సిక
ఇక హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్,త్రిష కృష్ణన్, అనుష్క శెట్టి,ఇలియానా,హన్సిక మోత్వానీ ఓటింగ్కు హాజరుకాలేదు. పూజా హెగ్డే, తమన్నా భాటియా, కీర్తీ సురేష్, రష్మిక మందన్న లాంటి హీరోయిన్లు ముఖం చాటేశారు. అయితే చాలా మంది హీరోయిన్లు హైదరాబాద్లో ఉండి కూడా ఓటు వేయడానికి రాకపోవడంపై సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.