Don't Miss!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దిశ ఘటనపై స్పందించిన ‘మా’.. గవర్నర్కి విన్నపం
హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. డాక్టర్ ప్రియాంక హత్యోదంతంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమాజం మొత్తం వ్యతిరేకంగా నిలబడగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నివైపుల నుంచి నినాదాలు వినిపిస్తున్నాయి. ఆ ఘటనకు కారకులైన దోషులకు మరణదండన విధించాలని సమాజం మొత్తం ఆగ్రహజ్వాలలు ఎగిసి పడుతున్నాయి.
దిశ హత్యచారం లాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని, దిశకు జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడదని, ఈ కేసుపై వేగంగా దర్యాప్తు జరిపి తొందరగా దోషులకు శిక్ష పడేలా చేయాలని కోరుతూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప్రతినిధులు కలిశారు. మా జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్.. ఉపాధ్యక్షురాలు హేమ.. అనిత చౌదరి.. జయలక్ష్మి తనీష్, సురేష్ కొండేటి.. ఏడిద శ్రీరామ్.. రవి ప్రకాష్ తదితరులు గవర్నర్ కి విన్నవించారు.
గురువారం (డిసెంబర్ 5) సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు గంటలవరకు తెలుగు పరిశ్రమలోని అన్ని విభాగాలవారు డా. జస్టిస్ ఫర్ దిశా ఆత్మశాంతి కొరకు సంతాప సభను ఏర్పాటు చేస్తున్నట్లు మా కార్యవర్గం ప్రకటించింది. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లోని కన్వెన్షన్ హాలులో ఈ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. సభ్యులందరు ఐదు గంటలకు రామానాయుడు కళామండపం దగ్గర సమావేశం కావాలని 'మా'కార్యవర్గం కోరింది.