Don't Miss!
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దిశ ఘటనపై స్పందించిన ‘మా’.. గవర్నర్కి విన్నపం
హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. డాక్టర్ ప్రియాంక హత్యోదంతంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమాజం మొత్తం వ్యతిరేకంగా నిలబడగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నివైపుల నుంచి నినాదాలు వినిపిస్తున్నాయి. ఆ ఘటనకు కారకులైన దోషులకు మరణదండన విధించాలని సమాజం మొత్తం ఆగ్రహజ్వాలలు ఎగిసి పడుతున్నాయి.
దిశ హత్యచారం లాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని, దిశకు జరిగిన అన్యాయం వేరొకరికి జరగకూడదని, ఈ కేసుపై వేగంగా దర్యాప్తు జరిపి తొందరగా దోషులకు శిక్ష పడేలా చేయాలని కోరుతూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ని మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప్రతినిధులు కలిశారు. మా జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్.. ఉపాధ్యక్షురాలు హేమ.. అనిత చౌదరి.. జయలక్ష్మి తనీష్, సురేష్ కొండేటి.. ఏడిద శ్రీరామ్.. రవి ప్రకాష్ తదితరులు గవర్నర్ కి విన్నవించారు.
గురువారం (డిసెంబర్ 5) సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు గంటలవరకు తెలుగు పరిశ్రమలోని అన్ని విభాగాలవారు డా. జస్టిస్ ఫర్ దిశా ఆత్మశాంతి కొరకు సంతాప సభను ఏర్పాటు చేస్తున్నట్లు మా కార్యవర్గం ప్రకటించింది. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లోని కన్వెన్షన్ హాలులో ఈ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. సభ్యులందరు ఐదు గంటలకు రామానాయుడు కళామండపం దగ్గర సమావేశం కావాలని 'మా'కార్యవర్గం కోరింది.